భారతీయ జనతా పార్టీ
భారతదేశం యొక్క రాజకీయ పార్టీ / From Wikipedia, the free encyclopedia
భారతీయ జనతా పార్టీ (భాజపా), భారతదేశంలోని ప్రముఖ జాతీయస్థాయి రాజకీయపార్టీలలో ఒకటి. 1980లో ప్రారంభించిన ఈ పార్టీ దేశములోని హిందూ అధికసంఖ్యాక వర్గ మత సాంఘిక, సాంస్కృతిక విలువల పరిరక్షణను ధ్యేయంగా చెప్పుకుంటుంది. సాంప్రదాయ సాంఘిక నియమాలు, దృఢమైన జాతీయరక్షణ దీని భావజాలాలు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధానపాత్ర పోషిస్తున్న సంఘ్ పరివార్ కుటుంబానికి చెందిన వివిధ రకాల హిందూ జాతీయవాద సంస్థలు భారతీయ జనతా పార్టీకి కార్యకర్తల స్థాయిలో గట్టి పునాదిని ఇస్తున్నాయి.
భారతీయ జనతా పార్టీ | |
---|---|
పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ | నరేంద్ర మోడీ |
లోక్సభ నాయకుడు | నరేంద్ర మోడీ (ప్రధానమంత్రి) |
రాజ్యసభ నాయకుడు | పీయూష్ గోయెల్ |
స్థాపన తేదీ | 6 ఏప్రిల్ 1980 (44 సంవత్సరాల క్రితం) (1980-04-06) |
Preceded by | భారతీయ జనసంఘ్ జనతా పార్టీ |
ప్రధాన కార్యాలయం | 11 అశోకా రోడ్, న్యూఢిల్లీ 110001 |
పార్టీ పత్రిక | కమల్ సందేశ్ |
యువత విభాగం | భారతీయ జనతా యువ మోర్చా |
మహిళా విభాగం | బి.జె.పి మహిళా మోర్చా |
రైతు విభాగం | బి.జె.పి. కిసన్ మోర్చా |
రాజకీయ విధానం | సంప్రదాయవాదం సామాజిక సంప్రదాయవాదం హిందూ మతం జాతీయవాదం హిందూత్వం గాంధేయవాద సామ్యవాదం[1] సమగ్ర మానవతావాదం |
రాజకీయ వర్ణపటం | Right-wing[1][2][3] |
International affiliation | None |
రంగు(లు) | Saffron |
ECI Status | National Party[4] |
కూటమి | National Democratic Alliance (NDA) |
లోక్సభ స్థానాలు | 271 / 545 [5](currently 542 members + 1 Speaker)
|
రాజ్యసభ స్థానాలు | 73 / 245 [6](currently 242 members)
|
స్థాపన నుండే, భాజపా భారత జాతీయ కాంగ్రేసు ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. భారతీయ రాజకీయరంగంలో నాలుగు దశాబ్దాలపాటు ఆధిపత్యము వహించిన కాంగ్రేసు పార్టీ వామపక్ష ధోరణులను తిప్పివేసేందుకు భాజపా ప్రాంతీయ పార్టీలతో పొత్తు కుదుర్చుకుంది. అయితే భాజపా భావజాల యుద్ధ నినాదము మాత్రం హిందుత్వమే (సాంస్కృతిక హిందూ జాతీయవాదం).
భాజపా, అనేక ఇతర పార్టీల మద్దతుతో 1999 నుండి 2004 వరకు భారతదేశ ప్రభుత్వము భారత కేంద్ర ప్రభుత్వాన్ని పాలించింది. దాని సీనియర్ నాయకులైన అటల్ బిహారీ వాజపేయి ప్రధానిగాను, లాల్ కృష్ణ అద్వానీ ఉప ప్రధానమంత్రిగానూ పనిచేశారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో ప్రధాన పార్టీ అయిన భాజపా, భారత పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షముగా 2014 మే వరకు కొనసాగింది.
2014 సార్వత్రిక ఎన్నికలలో లోక్ సభ లోని 543 స్థానాలకు మునుపెన్నడూ లేనన్ని 281 స్థానాలు గెలుచుకున్న భాజపా (మిత్ర పక్షాలతో కలిసి జాతీయ ప్రజాస్వామ్య కూటమికి 337 స్థానాలు) నరేంద్ర మోడీ నాయకత్వంలో అధికారం చేబట్టింది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో లోక్ సభ ఎన్నికల్లో 303 స్థానాల్లో విజయం సాధించింది. నరేంద్ర మోడీ నాయకత్వంలో మళ్లీ అధికారం చేపట్టింది.