బీర్బల్ సహాని
ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త / From Wikipedia, the free encyclopedia
బీర్బల్ సహాని (14 నవంబరు 1891 – 10 ఏప్రిల్ 1949) పురా వృక్ష శాస్త్రవేత్త. అతను భారత దేశానికి లభించిన అరుదైన శాస్త్రవేత్త. ఖగోళ, జ్యోతిష, గణిత, వైద్య, భౌతిక, రసాయన శాస్త్రాలలో మనకు ఎందరెందరో మహనీయులైన శాస్త్రవేత్తలున్నారు. ఈ శాస్త్రాలకు భిన్నమైన పక్షి శాస్త్రంలో విశేష ప్రతిభ కనబరచి గుర్తింపు పొందినవారు సలీంఆలీ అయితే పురా వృక్ష శాస్త్ర పరిశోధనలలో శాస్త్రీయ విజ్ఞాన పరిశోధనలను కొత్తపుంతలు తొక్కించింది మాత్రం బీర్బల్ సహానీ. అతను భారతీయ ఉపఖండంలోని శిలాజాలను అధ్యయనం చేసిన భారతీయ పాలియోబొటానిస్ట్. అతను భూగర్భ శాస్త్రం, పురావస్తు శాస్త్రంలో కూడా ఆసక్తి చూపించాడు. అతను 1946 లో లక్నోలో బీర్బల్ సహానీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలియోబోటనీని స్థాపించాడు. భారతదేశపు శిలాజ మొక్కల అధ్యయనంలో, మొక్కల పరిణామంలో అతని ప్రధాన రచనలు ఉన్నాయి[1][2][3]. అతను భారతీయ విజ్ఞాన విద్య స్థాపనలో కూడా పాల్గొన్నాడు. భారతదేశంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షుడిగా, స్టాక్హోమ్ అంతర్జాతీయ బొటానికల్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షుడిగా పనిచేశాడు.
బీర్బల్ సహాని | |
---|---|
జననం | 1891 , నవంబరు 14 బెహ్రా, సహరాన్ పూర్ జిల్లా, పశ్చిమ పంజాబ్ |
మరణం | 1949 , ఏప్రిల్ 10 లక్నో |
పౌరసత్వం | భారతీయుడు |
జాతీయత | బారతీయుడు |
రంగములు | పాలియో బోటనీ |
వృత్తిసంస్థలు | లక్నో |
చదువుకున్న సంస్థలు | గవర్నమెంటు కాలేజీ విశ్వవిద్యాలయం, లాహోర్, ఇమ్మాన్యుయేల్ కాలేజి, కేంబ్రిడ్జ్ |
పరిశోధనా సలహాదారుడు(లు) | ప్రొఫెసర్ సెవార్డ్ |
ఇతర విద్యా సలహాదారులు | గోబెల్ |
ప్రసిద్ధి | బెన్నెట్టిటేలియన్ ప్లాంట్, హోమోక్సిలాన్ - కొత్తరకం కలప |