ఖాట్మండు లోయ
From Wikipedia, the free encyclopedia
ఖాట్మండు లోయ, దీనిని నేపాల్ లోయ లేదా నేపాల్ వ్యాలీ అని కూడా పిలుస్తారు. విశాలమైన ఆసియా ఖండంలోని భారత ఉపఖండంలో పురాతన నాగరికతల కూడలిలో ఉంది. కనీసం 130 ముఖ్యమైన స్మారక చిహ్నాలను కలిగి ఉంది.హిందువులు, బౌద్ధులకు అనేక తీర్థయాత్ర ప్రదేశాలు ఉన్నాయి. లోయలో ఏడు ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి.[2]
ప్రపంచ వారసత్వ ప్రదేశం | |
---|---|
స్థానం | బాగ్మతి ప్రావిన్స్ , నేపాల్ |
సూచనలు | 121bis |
శాసనం | 1979 (3rd సెషన్ ) |
విస్తరణ | 2006 |
అంతరించేవి | 2003–2007[1] |
ప్రాంతం | 665 చ.కి.మీ |
భౌగోళిక నిర్దేశకాలు | 27°42′14″N 85°18′31″E |
నేపాల్ లోని ఖాట్మండు లోయ అత్యంత జనాభా కలిగి అభివృద్ధి చెందిన ప్రదేశం. అధిక సంఖ్యలో కొన్ని ప్రధాన కార్యాలయాలు ఈ లోయలో ఉన్నాయి. ఇది నేపాల్ దేశం ఆర్థిక కేంద్రంగా మారింది. నేపాల్లో అత్యధిక సంఖ్యలో జాతరలు (వీధి ఉత్సవాలు) జరుగుతాయి. దాని ప్రత్యేకమైన వాస్తుశిల్పం, గొప్ప సంస్కృతి, పర్యాటకుల సందర్సనల వలన ప్రసిద్ధి చెందింది. బ్రిటీష్ చరిత్రకారులు ఈ లోయను "నేపాల్ ప్రాపర్" అని పిలుస్తారు.
2015 ఏప్రిల్ లో సంభవించిన నేపాల్ భూకంపానికి ఖాట్మండు లోయలో భారీ నష్టం జరిగింది.[3] భూకంపం కారణంగా ఖాట్మండు లోయలో వేలాది మంది మరణించారు. ఖాట్మండు లోయలోని చాలా ప్రదేశాలలో మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. వాటిలో లలిత్పూర్, కీర్తిపూర్, మధ్యపూర్ తిమి, భక్తపూర్. ఖాట్మండు లోయ అంతటా ఉన్న పురపాలక సంఘాల పరిధిలో మొత్తం జనాభా 1.5 మిలియన్లు మంది ఉన్నారు. హిమాలయ పర్వత ప్రాంతంలో ఖాట్మండు అతిపెద్ద నగరం.