2015 నేపాల్ భూకంపం
From Wikipedia, the free encyclopedia
నేపాల్ భూకంపం (హిమాలయన్ భూకంపం అని కూడా వ్యవహరిస్తున్నారు) 7.8 (Mw) తీవ్రతతో 2015 ఏప్రిల్ 25 శనివారం నాడు 11:56 నేపాల్ స్టాండర్డ్ టైం (6:11:26 యుటీసీ) సమయంలో సంవించిన భూకంపం. లమ్జంగ్ (నేపాల్) కు ఆగ్నేయంగా దాదాపు 34 కిలోమీటర్ల దూరంలో, భూమికి 15 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం నెలకొనివుంది. 1934 నేపాల్-బీహార్ భూకంపం తర్వాత నేపాల్లో సంభవించిన అత్యంత తీవ్రమైన భూకంపం ఇదే.[1] దాదాపు 8,300 మంది ప్రజలు నేపాల్, భారతదేశంలోనూ, చైనాలోనూ, బంగ్లాదేశ్లోనూ దానికి సమీపంలో గల ప్రాంతాల్లో భూకంపం వల్ల కలిగిన ప్రమాదాల్లో చనిపోయారు.[5]
తేదీ | 2015 ఏప్రిల్ 25 (2015-04-25) |
---|---|
ఆరంభ సమయం | 11:56:26 NST[1] |
తీవ్రత | 7.8 Mw[1] |
లోతు | 15.0 kilometers (9 mi)[1] |
భూకంపకేంద్రం | 28.147°N 84.708°E / 28.147; 84.708[1] |
రకం | Thrust[1] |
ప్రభావిత ప్రాంతాలు | |
మొత్తం నష్టం | $3–3.5 billion direct losses[2] |
అత్యధిక తీవ్రత | IX (Violent)[1] |
Aftershocks | 6.6 Mw on 25 April at 12:30 6.7 Mw on 26 April at 12:54 [3] |
ప్రమాద బాధితులు | 2,263 dead[4] |
భూకంపం ఎవరెస్ట్ పర్వతం మీంచి హిమ సంపాతానికి దారితీసింది, దాని కారణంగా 17మంది మృతి చందారు. మృతుల సంఖ్య 2014 నేపాల్ హిమ సంపాతంలో మృతిచెందిన వారి సంఖ్యను దాటుకుపోయి, ఎవరెస్టు శిఖరంపైన అత్యంత ప్రాణాంతకమైన రోజుగా నిలిచింది.[6] ఖాడ్మండు దర్బార్ స్క్వేర్ సహా, కాఠ్మండు లోయలో యునెస్కో ప్రపంచ సాంస్కృతిక కేంద్రంలో శతాబ్దాల నాటి ప్రాచీన కట్టడాలు కూలిపోయాయి.