భారతదేశ భౌగోళికం
From Wikipedia, the free encyclopedia
భారతదేశం భూమధ్యరేఖకు ఉత్తరాన 8°4' ఉత్తర, 37°6' ఉత్తర అక్షాంశాలకూ, 68°7', 97°25' తూర్పు రేఖాంశాలకూ మధ్య ఉంది.[2] మొత్తం 3,287,263 square kilometres (1,269,219 sq mi) విస్తీర్ణంతో ఇది ప్రపంచంలోని ఏడవ అతిపెద్ద దేశం.[3][4] దేశం ఉత్తరం నుండి దక్షిణానికి 3,214 km (1,997 mi), తూర్పు నుండి పడమరకు 2,933 km (1,822 mi) ఉంటుంది. దీనికి 15,200 km (9,445 mi) భూ సరిహద్దు, 7,516.6 km (4,671 mi) తీరప్రాంతం ఉన్నాయి.[1]
ఖండం | ఆసియా |
---|---|
ప్రాంతం | దక్షిణాసియా (భారత ఉపఖండం) |
నిర్దేశాంకాలు | 21°N 78°E |
విస్తీర్ణం | ర్యాంకు: 7 వ |
• మొత్తం | 3,287,263 km2 (1,269,219 sq mi) |
• నేల | 91% |
• నీరు | 9% |
తీరరేఖ | 7,516.6 km (4,670.6 mi) |
సరిహద్దులు | Total land borders:[1] 15,200 km (9,400 mi) బంగ్లాదేశ్: 4,096.70 km (2,545.57 mi) చైనా: 3,488 km (2,167 mi) పాకిస్తాన్: 3,323 km (2,065 mi) నేపాల్: 1,751 km (1,088 mi) మయన్మార్: 1,643 km (1,021 mi) భూటాన్: 699 km (434 mi) |
అత్యంత ఎత్తైన బిందువు | కాంచనగంగ 8,586 m (28,169 ft) |
అత్యంత లోతైన బిందువు | కుట్టనాడ్ −2.2 m (−7.2 ft) |
అత్యంత పొడవైన నది | గంగ 2,525 km (1,569 mi) |
అత్యంత పెద్ద సరస్సు | లోక్టక్ సరస్సు (మంచినీటి) 287 km2 (111 sq mi) to 500 km2 (190 sq mi) చిలికా సరస్సు (ఉప్పునీటి సరస్సు) 1,100 km2 (420 sq mi) |
దేశానికి దక్షిణాన సరిహద్దుగా, హిందూ మహాసముద్రం ఉంది -వివరంగా చూస్తే, పశ్చిమాన అరేబియా సముద్రం, నైరుతిలో లక్షద్వీప్ సముద్రం, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉన్నాయి. పాక్ జలసంధి, మన్నార్ జలసంధి భారతదేశాన్ని శ్రీలంక నుండి వేరు చేస్తాయి. లక్షద్వీప్ దీవులకు దక్షిణాన ఎనిమిది డిగ్రీ ఛానల్కు ఆవల దాదాపు 125 kilometres (78 mi) దూరంలో మాల్దీవులు ఉన్నాయి. దేశ ప్రధాన భూభాగానికి ఆగ్నేయంగా దాదాపు 1,200 kilometres (750 mi) దూరంలో ఉన్న అండమాన్ నికోబార్ ద్వీపసమూహం, మయన్మార్, థాయిలాండ్, ఇండోనేషియాలతో సముద్ర సరిహద్దులను పంచుకుంటోంది. భారత ప్రధాన భూభాగపు దక్షిణ కొన (8°4′38″N, 77°31′56″E) కన్యాకుమారికి పక్కనే దక్షిణాన ఉంది, అయితే దేశం మొత్తానికి దక్షిణాది కొన బిందువు, గ్రేట్ నికోబార్ ద్వీపంలోని ఇందిరా పాయింట్. భారత పరిపాలనలో ఉత్తర కొనన ఉన్న ప్రదేశం, సియాచిన్ గ్లేసియర్ లోని ఇందిరా కల్. దేశపు ప్రాదేశిక జలాలు తీరరేఖ నుండి సముద్రంలోకి 12 nautical miles (13.8 mi; 22.2 km) దూరం వరకు విస్తరించాయి.[5] దేశానికి 2,305,143 km2 (890,021 sq mi) స్వంత ఆర్థిక మండలం ఉంది. ప్రపంచం లోని అతిపెద్ద స్వంత ఆర్థిక మండళ్ళలో దీనిది 18 వ స్థానం.
భారతదేశ ఉత్తర సరిహద్దులను హిమాలయ పర్వత శ్రేణులు నిర్వచిస్తాయి. ఇక్కడ చైనా, భూటాన్, నేపాల్లు సరిహద్దులుగా ఉన్నాయి. పాకిస్తాన్తో దేశ పశ్చిమ సరిహద్దు కారకోరం, పశ్చిమ హిమాలయ శ్రేణులు, పంజాబ్ మైదానాలు, థార్ ఎడారి, రాన్ ఆఫ్ కచ్ ఉప్పుకయ్యలలో ఉంది. సుదూర ఈశాన్యంలో, చిన్ హిల్స్, కాచిన్ హిల్స్, లోతైన అటవీ పర్వత ప్రాంతాలు, భారతదేశాన్ని బర్మా నుండి వేరు చేస్తాయి. తూర్పున, బంగ్లాదేశ్తో దాని సరిహద్దు ఎక్కువగా ఖాసీ కొండలు, మిజో కొండలు, ఇండో-గంగా మైదానంలోని పరీవాహక ప్రాంతంచే నిర్వచించబడింది.
గంగా నది భారతదేశంలో ఉద్భవించే అత్యంత పొడవైన నది. గంగా - బ్రహ్మపుత్ర వ్యవస్థ ఉత్తర, మధ్య, తూర్పు భారతదేశంలో అత్యధిక భాగాన్ని ఆక్రమించగా, దక్కన్ పీఠభూమి దక్షిణ భారతదేశంలో చాలా భాగాన్ని ఆక్రమించింది. సిక్కిం రాష్ట్రంలో, సముద్ర మట్టం నుండి 8,586 m (28,169 ft) ఎత్తున ఉన్న కాంచన గంగ శిఖరం, భారతదేశంలోనే ఎత్తైన ప్రదేశం. ఇది ప్రపంచంలో మూడవ ఎత్తైన శిఖరం. దేశంలో శీతోష్ణస్థితి దక్షిణాన భూమధ్యరేఖీయ శీతోష్ణస్థితి నుండి, హిమాలయాల ఎగువ ప్రాంతాలలో ఆల్పైన్, టండ్రా శీతోష్ణస్థితుల వరకూ మారుతూంటుంది. భౌగోళికంగా, భారతదేశం ఇండో-ఆస్ట్రేలియన్ ప్లేట్కు ఉత్తర భాగంలో ఉన్న ఇండియన్ ప్లేట్లో ఉంది.