శ్రీరంజని (సీనియర్)
సినీ నటి / From Wikipedia, the free encyclopedia
శ్రీరంజని (సీనియర్)గా ప్రసిద్ధి చెందిన మంగళగిరి శ్రీరంజని (1906 - 1939) ప్రముఖ పాతతరం చలన చిత్ర నటి. ఈవిడ మరో నటి శ్రీరంజని (జూనియర్)కు అక్క, దర్శకుడు ఎం.మల్లికార్జునరావుకు తల్లి. 1906లో గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట మండలంలోని మురికిపూడి గ్రామంలో జన్మించింది. ఈవిడ 1920, 1930లలో గ్రామోఫోన్ కంపెనీ ఆఫ్ ఇండియా వారు విడుదలచేసిన నాటకాలను రికార్డులలో గాయనిగా తన ప్రైవేటు గీతాల ద్వారా ప్రసిద్ధి పొందింది. చిత్రాలలో నటించకముందు ఈమె పౌరాణిక నాటకాలలో అభిమన్యుడు, సత్యవంతుడు, కృష్ణుడు వంటి పురుష పాత్రలు వేసేది,[2] అప్పట్లో ఆవిడ కృష్ణ విలాస నాటక సమాజంలో సభ్యురాలు. సి.పుల్లయ్య తీసిన లవకుశ (1934) ఈవిడ మొదటి చిత్రం. ఈవిడ మొత్తం 9 చిత్రాలలో నటించింది. 1939లో క్యాన్సర్ వ్యాధి కారణంగా మరణించింది.
శ్రీరంజని పేరుతో ఉన్న ఇతర వ్యాసాల కొరకు, శ్రీరంజని చూడండి.
త్వరిత వాస్తవాలు శ్రీరంజని, జననం ...
శ్రీరంజని | |
---|---|
జననం | 1906 మురికిపూడి, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ |
మరణం | 1939 మురికిపూడి, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ |
మరణ కారణం | క్యాన్సర్ |
ఇతర పేర్లు | శ్రీరంజని సీనియర్ |
వృత్తి | రంగస్థల, చలనచిత్ర నటి |
మతం | హిందూ మతం |
భార్య / భర్త | కె.నాగమణి[1] |
పిల్లలు | ముగ్గురు కుమారులు |
మూసివేయి