బోయకొట్టములు పండ్రెండు
From Wikipedia, the free encyclopedia
బోయకొట్టములు పండ్రెండు అనే గ్రంథం కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె వ్రాసిన చారిత్రిక నవల. 9వ శతాబ్ది నాటి తొలి తెలుగు పద్యశాసనమైన పండరంగని అద్దంకి శాసనమును ఆధారం చేసుకుని దీనిని వ్రాశాడు. ఆ శాసనం తెలుగు పద్యసాహిత్య రచన 9వ శతాబ్ది నాటికే ఉన్నట్టు స్పష్టపరిచేందుకు ఒక ఆధారం. అంతేకాక పన్నెండు బోయకొట్టాలను పండరంగడనే సైన్యవీరుడు ఓడించాడని కూడా తెలుపుతోంది. దీన్ని ఆధారం చేసుకుని రచయిత రెండువందల యేళ్ళ ఆంధ్ర రాజ్యాల చరిత్ర పునఃసృజించి చారిత్రక నవలారచన చేశాడు.[1]
త్వరిత వాస్తవాలు కృతికర్త:, దేశం: ...
బోయకొట్టములు పండ్రెండు | |
బోయకొట్టములు పండ్రెండు నవల ముఖపత్రం | |
కృతికర్త: | కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | నవల |
ప్రచురణ: | కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె |
విడుదల: | డిసెంబరు 2013 |
పేజీలు: | 273 |
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): | ETC8KTEL08 |
మూసివేయి