పూరి (ఒరిస్సా)
ఒడిశా లోని నగరం / From Wikipedia, the free encyclopedia
పూరి ఒడిషా రాష్ట్రం లోని తీరప్రాంత పట్టణం. ఇది పూరి జిల్లాకు కేంద్రం. ఇది రాష్ట్ర రాజధాని భువనేశ్వర్కు దక్షిణంగా 60 కి.మీ. దూరంలో ఉంది. పట్టణంలో ఉన్న 12వ శతాబ్ద కాలం నాటి జగన్నాథ దేవాలయం పేరిట దీనిని శ్రీ జగన్నాథ ధామం అని కూడా పిలుస్తారు. హిందువుల ఒరిజినల్ చార్ ధామ్ తీర్థయాత్రా స్థలాలలో ఇది ఒకటి.
పూరి | |
---|---|
నగరం | |
Nickname: జగన్నాథ ధామం | |
Coordinates: 19°48′38″N 85°49′53″E | |
Country | India |
రాష్ట్రం | Odisha |
జిల్లా | పూరి |
Government | |
• Type | Municipality |
• Body | Puri Municipality |
Area | |
• Total | 16.84 km2 (6.50 sq mi) |
Elevation | 0.1 మీ (0.3 అ.) |
Population (2011) | |
• Total | 2,01,026 |
• Rank | India 228th, Odisha 5th |
• Density | 12,000/km2 (31,000/sq mi) |
భాషలు | |
• అధికారిక | ఒరియా |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 752001 |
Telephone code | 06752,06758 (06758 for Nimapara & 06752 for Puri) |
Vehicle registration | OD-13 |
పురాతన కాలం నుండి పూరీని అనేక పేర్లతో పిలుస్తూ ఉన్నారు. స్థానికంగా "శ్రీ క్షేత్రం" అని, జగన్నాథ దేవాలయాన్ని "బడదేవలా" అనీ పిలుస్తారు. క్రీ.శ. 7వ శతాబ్దం నుండి 19వ శతాబ్దపు ఆరంభం వరకు ఆలయ సంపదను దోచుకోవాలనే లక్ష్యంతో పూరీని, జగన్నాథ దేవాలయాన్నీ ముస్లిం పాలకులు 18 సార్లు ఆక్రమించారు. 1803 నుండి ఆగస్టు 1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందే వరకు పూరీ, బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉండేది. సంస్థానాలు ఇప్పుడు లేనప్పటికీ, గజపతి వంశీకులే ఇప్పటికీ ఆలయ విధులను నిర్వహిస్తున్నారు. పట్టణంలో అనేక హిందూ మఠాలు ఉన్నాయి.
భారత ప్రభుత్వం, హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన పథకం కింద పూరీని వారసత్వ నగరాల్లో ఒకటిగా ఎంపిక చేసింది. 2017 మార్చి చివరి నాటికి 27 నెలలలోపు అమలు చేయడానికి "సంపూర్ణ అభివృద్ధిపై దృష్టి" పెట్టిన 12 వారసత్వ నగరాల్లో ఒకటిగా దీన్ని ఎంపిక చేసారు.[2]