పాండురంగ వామన్ కాణే
భారతీయ ఇండాలజిస్ట్ మరియు సంస్కృత పండితుడు / From Wikipedia, the free encyclopedia
ఆచార్య పాండురంగ వామన్ కాణే (1880-1972) మహారాష్ట్రకు చెందిన ప్రముఖ భారతీయ చరిత్రకారుడు, సంస్కృత పండితుడు, ఉపాధ్యాయుడు. 1963 లో ఈయన భారతరత్న పురస్కారానికి ఎంపికయ్యాడు. ఈయనకు మహామహోపాధ్యాయ అనే బిరుదు ఉంది. హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర ఈయన రచించిన ప్రఖ్యాత గ్రంథం. ఈ పుస్తకం కోసం ఈయన శతాబ్దాలుగా వెలువడిన అనేక తాళపత్ర గ్రంథాలను పరిశోధించాడు. ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బాంబే, భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లాంటి సంస్థలో ఉన్న వనరులకు ఇందుకోసం వాడుకున్నాడు.
త్వరిత వాస్తవాలు పాండురంగ వామన్ కాణే, జననం ...
పాండురంగ వామన్ కాణే | |
---|---|
జననం | (1880-05-07)1880 మే 7 రత్నగిరి జిల్లా, మహారాష్ట్ర |
మరణం | 1972 మే 8(1972-05-08) (వయసు 92)[1] |
మూసివేయి