చంద్రశేఖర్ సింగ్
భారతీయ రాజకీయవేత్త / From Wikipedia, the free encyclopedia
చంద్రశేఖర్ సింగ్ (1927 ఆగస్టు 17 - 1986 జూలై 9) బీహారుకు చెందిన రాజకీయ నాయకుడు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు. 1983 ఆగష్టు నుండి 1985 మార్చి వరకు బీహారుకు 16 వ ముఖ్యమంత్రిగా పనిచేసాడు.[2] మాజీ ప్రధాన మంత్రులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ల మంత్రివర్గాల్లో మంత్రి పదవులను నిర్వహించారు. అతను బీహార్ విధానసభకు నాలుగుసార్లు ఎన్నికయ్యాడు. పార్లమెంటుకు కూడా ఎన్నికయ్యారు.
చంద్రశేఖర్ సింగ్ | |||
బీహారు 20 వ ముఖ్యమంత్రి | |||
కేంద్ర పెట్రోలియమ్ శాఖ సహాయ మంత్రి | |||
వ్యక్తిగత వివరాలు |
|||
---|---|---|---|
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | మనోరమా సింగ్[1] | ||
సంతానం | కంచన్ సింగ్, వి.ఎస్.సింగ్, శశాంక్ శేఖర్ |
అతను ఎకనామిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందాడు. [3]
అతను చివరిసారిగా కేంద్ర పెట్రోలియం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాడు, ఈ సమయంలో అతను క్యాన్సర్ కారణంగా మరణించాడు.
అతను 1952, 1957, 1969 లో ఝాజా (విధాన సభ నియోజకవర్గం) నుండి బీహార్ విధానసభకు ఎన్నికయ్యాడు. అతను 1962 లో ఝాజా నుండి ఓడిపోయాడు. [4] అతను 1972 లో చకాయ్ నుండి విధానసభకు ఎన్నికయ్యాడు. అతనికీ రాజపుత్ర నేత సత్యేంద్ర నారాయణ్ సిన్హాకూ చుట్టరికం ఉంది.1980 పార్లమెంటు ఎన్నికలలో అతను బంకా (లోక్ సభ నియోజకవర్గం) నుండి అత్యధిక మెజారిటీతో గెలిచాడు, 1983 లో, ఇందిరా గాంధీ అతన్ని బిహార్ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. 1985 ఎన్నికల తరువాత, ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ పెట్రోలియం శాఖ కేంద్ర మంత్రిగా కేంద్ర మంత్రివర్గం లోకి తీసుకున్నాడు. 1985 లో బంకా లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో గెలిచాడు. 1986 లో అతని మరణం తరువాత అక్కడ జరిగిన ఉప ఎన్నికలో అతని భార్య మనోరమ సింగ్ గెలిచింది. అతను మొత్తం 5 సార్లు భారత పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. [5]
అతని పేరు మీద బీహార్లోని జమూయిలో ఒక మ్యూజియంను ఏర్పాటు చేసారు. [6] ఇది పరిసర ప్రాంతాల లోని పురాతన వస్తువులను పరిరక్షించడానికి 1983 లో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని స్థాపించింది.