ఎం. హరికిషన్
బాల సాహితీ కారుడు, రచయిత, కవి / From Wikipedia, the free encyclopedia
ఎం. హరికిషన్ తెలుగు బాలసాహిత్యంలో ఒక నూతన ఒరవడికి కృషిచేస్తున్న రచయిత. అతను పిల్లలు మాట్లాడుకునే భాషలో అత్యంత సరళంగా, పిల్లలు తమంతట తామే చదవుకొనేలా కథలు రాయడంలో సిద్ధహస్తుడు. కర్నూలు జిల్లాలో అంతరించిపోతున్న జానపద బాల సాహిత్యాన్ని వెలికితీస్తూ ఠింగురుబిళ్ళ, కిర్రు కిర్రు లొడ్డప్ప ఒకటి తిందునా... రెండు తిందునా, నక్కబావ-పిల్లిబావ. నల్లకుక్క, నలుగురు మూర్ఖులు, కోటకొండ మొనగాడు... ఇలా అనేక పుస్తకాలు వెలువరించాడు. అప్పుడప్పుడే అక్షరాలు దిద్దుతూ, చదవడం నేర్చుకుంటున్న చిన్నారుల కోసం ఏమయినా చేయాలనే తపనతో "ఒత్తులు లేని గేయాలు, బొమ్మలతో సామెతలు, పిల్లల గేయాలు, సంయుక్త అక్షరాలు లేని కథలు" సృష్టించాడు.[1]
త్వరిత వాస్తవాలు ఎం. హరికిషన్, పుట్టిన తేదీ, స్థలం ...
ఎం. హరికిషన్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | (1972-05-19) 1972 మే 19 (వయసు 52) కర్నూలు జిల్లా పాణ్యం |
వృత్తి | ఉపాధ్యాయుడు |
భాష | తెలుగు |
జాతీయత | భారతీయుడు |
విద్య | శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ |
పూర్వవిద్యార్థి | శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం |
రచనా రంగం | సాహితీ వ్యాసంగం కథా రచయిత బాల సాహితీవేత్త చరిత్రకారుడు |
గుర్తింపునిచ్చిన రచనలు | కర్నూలు కథ |
ప్రభావం | తుమ్మల రామకృష్ణ |
పురస్కారాలు | బాలసాహితీ రత్న (2011) |
చురుకుగా పనిచేసిన సంవత్సరాలు | 1997 నుండి |
తండ్రి | హుసేనయ్య |
తల్లి | కృష్ణవేణమ్మ |
మూసివేయి