అమృతా ప్రీతం
నవలా రచయిత, కవి, వ్యాసకర్త, హిందీ మరియు పంజాబీ భాషలో / From Wikipedia, the free encyclopedia
అమృతా ప్రీతం వినండి (help·info) (1919 ఆగస్టు 31 - 2005 అక్టోబరు 31) భారతదేశపు రచయిత్రి. ఆమె పంజాబీ, హిందీ భాషలలో రచనలు చేసింది.[1] ఆమె పంజాబీ భాషలో మొట్టమొదటి కవయిత్రి, నవలా రచయిత్రి, వ్యాసకర్త. 20వ శతాబ్దంలో ప్రముఖ కవయిత్రిగా కొనియాడబడింది. ఆమె భారత-పాకిస్తాన్ సరిహద్దుకు రెండు వైపులనూ సమానంగా ప్రేమించిన వ్యక్తి. ఆరు దశాబ్దాల జీవితంలో ఆమె సుమారు 100 పుస్తకాలను రచించింది. వాటిలో కవిత్వం, కల్పనా కథలు, జీవిత చరిత్రలు, వ్యాసాలు, పంజాబీ జానపద పాటల సేకరణ, స్వీయ చరిత్ర ఉన్నాయి. అవి ఇతర భారతీయ భాషలు, విదేశీయ భాషలలోనికి అనువదించబడ్డాయి.[2][3]
అమృతా ప్రీతం | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | (1919-08-31)1919 ఆగస్టు 31 గుజ్రాన్వాలా, పంజాబ్ ప్రస్తుత పాకిస్తాన్ లోని రాష్ట్రము |
మరణం | 2005 అక్టోబరు 31(2005-10-31) (వయసు 86) ఢిల్లీ, భారత్ |
వృత్తి | నవలా రచయిత, కవయిత్రి, వ్యాస రచయిత |
జాతీయత | భారతీయురాలు |
కాలం | 1936–2004 |
రచనా రంగం | కవిత్వము , గద్య కావ్యము, జీవిత కథ |
విషయం | భారతదేశ విభజన, మహిళకు, కల |
సాహిత్య ఉద్యమం | మోహము-ప్రగతివాదం |
గుర్తింపునిచ్చిన రచనలు | పింజర్ (నవల) ఆజ్ కె వారిస్ షా ను (కవిత) సునేరే (కవిత) |
ఆమె రాసిన పదునైన కవిత "ఆజ్ ఆఖాన్ వారిస్ షా ను" 18వ శతాబ్దానికి చెందిన కవి, వారిస్ షా స్మృతిగా రాసిన విషాద గీతం. ఇందులో ఆమె భారత్ విభజన సమయంలో జరిగిన ఊచకోతపై వేదనను వ్యక్తీకరించింది. ఒక నవలా రచయిత్రిగా ఆమె గుర్తింపబడిన నవల "పింజర్" (బోను) (1950). దీనిలో ఆమె తన చిరస్మరణీయ పాత్ర "ప్యూరో"ను సృష్టించింది. ఈ పాత్ర ద్వారా మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న హింస, మానవత్వానికి నష్టం కలిగించిన అంశాలను గూర్చి సంగ్రహంగా తెలియజేసింది. ఈ నవల 2003 లో "పింజర్" చలన చిత్రంగా రూపొందించబడి పురస్కారాన్ని గెలుచుకుంది.[4][5]
పూర్వపు బ్రిటిష్ ఇండియా 1947 లో భారతదేశం , పాకిస్తాన్ అనే స్వతంత్ర దేశాలుగా విడిపోయినపుడు, ఆమె భారతదేశానికి వలస వచ్చింది. అయితే పాకిస్తాన్లో మోహన్ సింగ్, శివ్ కుమార్ బటాల్వి వంటి సమకాలీయులతో పోలిస్తే ఆమెకు ఉన్న ప్రజాదరణ ఆమె జీవితాంతమూ కొనసాగింది.
పంజాబీ సాహిత్యంలో మహిళా గళాన్ని వినిపించే అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా గుర్తింపబడింది. 1956లో ఆమె రాసిన "సనెహాడ్" (సందేశాలు) అనే గొప్ప కవితకు గాను సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందింది. ఈ పురస్కారాన్ని పొందిన మొదటి స్త్రీగా గుర్తింపబడింది.[6] తరువాత ఆమె 1982లో "కాగజ్ తె కాన్వాస్" రచనకు గాను భారతదేశంలో అత్యున్నత సాహితీ పురస్కారమైన భారతీయ జ్ఞానపీఠ్ పురస్కారాన్ని పొందింది. 1969 లో పద్మశ్రీ పురస్కారాన్ని చివరకు 2004 లో భారత రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకుంది. అదే సంవత్సరంఆమె భారత అత్యున్నత సాహితీ పురస్కారమైన సాహిత్య అకాడమీను అందుకున్నది. సాహిత్య అకాడమీ ఫెలోషిప్ ను "ఇమ్మోర్టల్స్ ఆఫ్ లిటరేచర్" రచనకు అందుకుంది.[7]