వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)
From Wikipedia, the free encyclopedia
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, విశాఖపట్టణంలో సింహాచలం అనే ప్రాంతంలో, నగరనడిబొడ్డునుండి 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయం సముద్రమట్టానికి 244 మీ ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది.ప్రస్తుత ఆలయాన్ని 13వ శతాబ్దంలో ఒడిషాకు చెందిన తూర్పు గంగా రాజు లాంగుల నరసింగ దేవ I కళింగ వాస్తుశిల్పం ప్రకారం నిర్మించారు, 1268 ADలో అతని కుమారుడు భానుదేవ I చేత ప్రతిష్ఠించబడింది.
వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం) | |
---|---|
భౌగోళికాంశాలు : | 17.77987°N 83.213925°E / 17.77987; 83.213925 |
పేరు | |
ప్రధాన పేరు : | శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం |
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా: | విశాఖపట్నం |
ప్రదేశం: | సింహాచలం |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | శ్రీ నరసింహస్వామి |
ప్రధాన దేవత: | లక్ష్మీదేవి |
పుష్కరిణి: | వరాహ పుష్కరిణి |
కవులు: | గోగులపాటి కూర్మనాధ కవి |
ముఖ్య_ఉత్సవాలు: | చందనోత్సవం, గిరి ప్రదక్షిణ |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | సా.శ. 1098) |
సృష్టికర్త: | ప్రహ్లాదుడు |
ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం (52 కోట్ల రూపాయలు) కలిగిన దేవాలయం. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతీ సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు (మే నెలలో) వస్తుంది.