మహాత్మా గాంధీ
భారతదేశ జాతిపిత, స్వాతంత్ర్య సమర యోధులు. / From Wikipedia, the free encyclopedia
మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ( వినండి (help·info)) (అక్టోబరు 2, 1869 – జనవరి 30, 1948) ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అతని ఆయుధాలు. కొల్లాయి కట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటాడు.
త్వరిత వాస్తవాలు మహాత్మ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, జననం ...
మహాత్మ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ | |
---|---|
జననం | మోహన్ దాస్ కరంచంద్ గాంధీ (1869-10-02)1869 అక్టోబరు 2 పోర్బందర్, కఠియావార్ ఏజెంసీ, బ్రిటీష్ రాజ్ |
మరణం | 1948 జనవరి 30(1948-01-30) (వయసు 78) న్యూ ఢిల్లీ, డొమినియన్ ఆఫ్ ఇండియా |
మరణ కారణం | హత్య |
స్మారక చిహ్నం | రాజ్ ఘాట్, గాంధీ స్మృతి |
పౌరసత్వం |
|
విద్యాసంస్థ |
|
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1893–1948 |
శకం | బ్రిటీష్ రాజ్యం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ఆంగ్లేయుల నుంచి భారత స్వాతంత్ర్యోద్యమానికి నాయకత్వం, అహింసా పోరాటం |
గుర్తించదగిన సేవలు | సత్యశోధన |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
ఉద్యమం | భారత స్వాతంత్ర్యోద్యమము |
జీవిత భాగస్వామి | కస్తూర్బా గాంధీ
(m. 1883; మరణం 1944) |
పిల్లలు | |
తల్లిదండ్రులు |
|
సంతకం | |
మూసివేయి
20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితం చేసిన రాజకీయ నాయకునిగా అతన్ని కేబుల్ న్యూస్ నెట్వర్క్ (CNN) జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు.