భూటాన్ - భారత దేశ సంబంధాలు
From Wikipedia, the free encyclopedia
హిమాలయ రాజ్యమైన భూటాన్కీ, రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సాంప్రదాయకంగా సన్నిహఙతంగా ఉంటాయి ఈ రెండు దేశాలూ ఒక ప్రత్యేకమైన సంబంధం కలిగి ఉన్నాయి, [1] [2] ఆ ప్రత్యేక అనుబంధం ద్వారా భూటాన్ ఒక రక్షిత రాజ్యంగా ఉంటుంది, కానీ అది భారతదేశపు రక్షిత ప్రాంతం కాబోదు. భూటాన్ విదేశాంగ విధానం, రక్షణ, వాణిజ్యాలపై భారతదేశం ప్రభావశీలంగా ఉంది. 2012–13 ఆర్థిక సంవత్సరంలో, ఈ దేశానికి భారతదేశం ఇచ్చిన బడ్జెట్ మద్దతు 600 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు 3000 కోట్ల రూపాయలు). ఇది 2015-16లో 985 మిలియన్ అమెరికన్ డాలర్లకు (6160 కోట్ల రూపాయలకు) చేరుకుంది. ఇలా భారతదేశ విదేశీ సహాయానికి అతిపెద్ద లబ్ధిదారుగా భూటాన్ నిలిచింది. భూటాన్ ప్రధాన మంత్రి, షెరింగ్ టోబ్గే, 2013 ఆగస్టులో కొత్త ఢిల్లీ పర్యటన సందర్భంగా భూటాన్ కోసం భారతదేశం నుండి 5400 కోట్ల రూపాయల (ఒప్పందం కుదుర్చుకునే సమయంలో మారకపు రేట్ల ప్రకారం US $ 819 మిలియన్లు) అదనపు సహాయ ప్యాకేజీని అభ్యర్థించారు. ఈ మొత్తంలో ఐదవ వంతు (4500 కోట్ల రూపాయలు) భూటాన్ దేశపు 11వ పంచవర్ష ప్రణాళికకు కేటాయించబడింది. మునుపటి ప్రణాళిక కాలంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల కోసం 400 కోట్ల రూపాయలు కేటాయించారు. భారతదేశపు "ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ" లో మిగిలిన 5 బిలియన్ రూపాయలు మందగమనంలో సాగుతున్న భూటాన్ ఆర్థిక వ్యవస్థ కోసం. భారతదేశం భూటాన్లో 1,416 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసే మూడు జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్వహిస్తోంది, ఇవి కాక 2,129 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసే మరో 3 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. భూటాన్ మూడవ ప్రధాన మంత్రి లోటే థెరింగ్ నవంబర్ 2018లో తన మొదటి విదేశీ పర్యటనలో 12వ పంచవర్ష ప్రణాళిక కోసం సుమారు 45 బిలియన్ డాలర్ల (సుమారు 63.5 కోట్ల రూపాయల) సహాయ ప్యాకేజీని పొందారు. ఈ సమావేశంలో మంగ్దేచు హైడ్రోపవర్ ప్రాజెక్ట్ ప్లాంట్ సుంకం రేటు కూడా చర్చకు వచ్చింది, ఇక్కడ లోటే షెరింగ్ రేటును Nu.4.27 కు (Nu అంటే భూటానీస్ కరెన్సీ అన్గల్ట్రమ్) పెంచడానికి ప్రయత్నించారు, కాని ఇది భారత ప్రభుత్వ చర్చల ధర Nu.4.1 వైపు ముగిసింది. తుదకు ప్లాంట్ కోసం సవరించిన సుంకం రేటు అప్పుడు Nu.4.12 వద్ద పరిష్కారమైంది. భూటాన్ ప్రభుత్వం వాణిజ్య సౌకర్యాలను, ఆర్థిక సంబంధాలను వృద్ధి చేయడానికి 4 బిలియన్లను అందుకుంది. [3]