బట్టమేక పిట్ట
From Wikipedia, the free encyclopedia
బట్టమేక పిట్ట ప్రధాన స్థావరం నంద్యాల జిల్లాలోని రోళ్ళపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఈరకం పక్షులు ఆంధ్రప్రదేశ్లో సుమారు 150 మాత్రమే ఉన్నాయి. గతంలో ఈ సంఖ్యగా అధికంగా వుండేదని, అయితే వేటగాళ్ల ఉచ్చులకు బలై వాటిసంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోందని అటవీశాఖాధికారులు చెబుతున్నారు. 1979లో బాంబేరిసెర్చ్ వారు పరిశోధించి బట్టమేక పక్షి ప్రాధాన్యతను గుర్తించారు. ప్రముఖ పక్షి శాస్తవ్రేత్త, నోబుల్ అవార్డు గ్రహిత సలీంఅలీ 1980లో రోళ్లపాడు వద్ద బట్టమేక పక్షిని సంరక్షించేందుకు చర్యలు తీసుకున్నారు. 1988లో ఈ ప్రాంతాన్ని వన్యప్రాణి అభయారణ్యంగా ప్రకటించి 600 హెక్టారుల భూమిని దీని కొరకు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అలగనూరు గ్రామంవద్ద ఉన్న సుంకేసుల సమీపంలో 800 ఎకరాల భూమిని కేటాయించి వాటి సంరక్షణకు సిబ్బందిని నియమించారు.
బట్టమేక పిట్ట Great Indian bustard | |
---|---|
At Naliya grasslands, Kutch, India | |
Conservation status | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | Gruiformes |
Family: | Otididae |
Genus: | Ardeotis |
Species: | A. nigriceps |
Binomial name | |
Ardeotis nigriceps (Vigors, 1831) | |
Points where the species has been recorded. Once widespread, the species is today found mainly in central and western India. | |
Synonyms | |
Choriotis nigriceps |