జైసల్మేర్ కోట
From Wikipedia, the free encyclopedia
జైసల్మేర్ కోట, భారత రాజస్థాన్ లోని జైసల్మేర్ నగరంలో ఉంది.ప్రపంచంలోని అతి కొద్ది "జీవన కోటలలో" ఇది ఒకటి అని నమ్ముతారు (కార్కాస్సోన్, ఫ్రాన్స్ వంటివి). ఎందుకంటే పాత నగర జనాభాలో నాలుగవ వంతు ఇప్పటికీ కోటలోనే నివసించుచున్నారు.జైసల్మేర్ నగరం 800 సం.ల చరిత్రలో చెప్పుకోదగిన విషయంగా ఈ కోటకు గుర్తింపు ఉంది.జైసల్మేర్ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కోట వెలుపల మొదటి స్థావరాలు 17 వ శతాబ్దంలో వచ్చాయని చెబుతారు.జైసల్మేర్ కోట రాజస్థాన్లో ఉన్న పురాతన కోటలలో ఇది రెండవది.దీనిని సా.శ. 1156 లో భాటి రాజపుత్రుడు (పాలకుడు) జైసల్ నిర్మించాడు.జైసల్ నిర్మించినందున దానికి అతనిపేరు వాడుకలోకి వచ్చింది.ముఖ్యమైన వాణిజ్య వ్యాపారాలకు అనువుగా పురాతన సిల్క్ రోడ్డు కూడలి వద్ద ఉంది.
జైసల్మేర్ కోట | |
---|---|
జైసల్మేర్ ఖిల్లా లేదా సోనార్ ఖిల్లా | |
జైసల్మేర్ రాష్ట్రం, రాజస్థాన్ లో భాగం | |
జైసల్మేర్ జిల్లా, రాజస్థాన్ | |
భౌగోళిక స్థితి | 26.9127°N 70.9126°E / 26.9127; 70.9126 |
రకము | Desert Fortification |
స్థల సమాచారం | |
నియంత్రణ | జైసల్మేర్ రాష్ట్రం |
సాధారణ ప్రజలకు ప్రవేశానుమతి | అవును |
పరిస్థితి | సంరక్షించబడిన కట్టడం |
స్థల చరిత్ర | |
కట్టిన సంవత్సరం | 1155 AD |
కట్టించింది | రావల్ జైసల్ |
Garrison information | |
Occupants | జైసల్మేర్ నగరంలోని నాలుగవ వంతు జనాభా |
రకం | సాంస్కృతిక |
క్రైటేరియా | ii, iii |
గుర్తించిన తేదీ | 2013 (36th session) |
దీనిలో భాగం | రాజస్థాన్ హిల్ ఫోర్ట్స్ |
రిఫరెన్సు సంఖ్య. | 247 |
రాజస్థాన్ | భారతదేశం |
హిందూ | ఆసియాలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా |
భారీ పసుపు ఇసుకరాయితో నిర్మించిన కోట గోడలు పగటిపూట సింహం రంగుగానూ, సూర్యుడు అస్తమించేటప్పుడు తేనె - బంగారం రంగుగా కనపడతాయి.దీనివలన ఎడారిలో కోట ఉందనే విషయాన్ని మభ్యపెడుతుంది.ఈ కారణంగా దీనిని సోనార్ క్విలా, గోల్డెన్ ఫోర్ట్ అని పిలుస్తారు.[1] త్రికూటా కొండపై ఉన్న గొప్ప థార్ ఎడారి ఇసుక విస్తరణ మధ్య ఈ కోట ఉంది. ఇది నేడు నగరం దక్షిణ అంచున ఉంది. అది కొండప్రాంతం అంతా అవరించి ఉంటుంది. కోట చుట్టూ ఉన్న విస్తారమైన టవర్లు చాలా మైళ్ళ వరకు కనిపించేలా చేస్తాయి.
2013 లో కంబోడియాలోని నమ్ పెన్లో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ 37 వ సెషన్లో, జైసల్మేర్ ఫోర్ట్, రాజస్థాన్ లోని 5 ఇతర కోటలతో పాటు, రాజస్థాన్ లోని హిల్ ఫోర్ట్స్ గ్రూప్ క్రింద యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.[2][3]