కోహినూరు వజ్రం
From Wikipedia, the free encyclopedia
కోహినూర్ (కో-ఇ-నూర్; ఉర్దూ లో "కాంతిపర్వతం") ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాలలో ఒకటి. పారశీక భాషలో కోహినూరు అనగా కాంతి పర్వతం (కోహ్=పర్వతం, నూర్=కాంతి) "కాంతి పర్వతం".,[6] దీని బరువు 105.6 carats (21.12 g) .[lower-alpha 1]. ఇది బ్రిటిష్ క్రౌన్ ఆభరణాలలో భాగం.
బరువు | 105.602 carats (21.1204 g)[lower-alpha 1] |
---|---|
కొలతలు | 3.6 cm (1.4 in) పొడవు 3.2 cm (1.3 in) వెడల్పు 1.3 cm (0.5 in) లోతు |
రంగు | డి (రంగులేదు)[4] |
కోత | అండాకారపు కాంతిపుంజం |
వెలికితీసిన దేశం | భారతదేశం |
వెలికితీసిన గని | కోళ్లూరు గని |
కోత చేసినవారు | Levie Benjamin Voorzanger |
యజమాని | ఎలిజబెత్ II రాణి, క్రౌన్ హక్కుదారు కావున[5] |
కాకతీయ రాజవంశం కాలంలో భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పూర్వపు గుంటూరు జిల్లా, ప్రస్తుత పల్నాడు జిల్లా, బెల్లంకొండ మండలం కోళ్లూరు గనులలో తవ్వినట్లు భావించబడుతున్నా, దాని మూల బరువు గురించి రికార్డులు లేవు. తొలిసారిగా ధృవీకరించబడిన బరువు 186 పాత క్యారెట్లు (191 మెట్రిక్ క్యారెట్లు లేదా 38.2 గ్రా). దీనిని ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖల్జీ స్వాధీనం చేసుకున్నాడు. వజ్రం మొఘల్ నెమలి సింహాసనం లో ఒక భాగం. ఇది దక్షిణ, పశ్చిమ ఆసియాలో చాలా చేతులు మారి, చివరికి పదకొండు ఏళ్ల చక్రవర్తి మహారాజా దులీప్ సింగ్ పరిపాలనలో వున్న పంజాబ్ బ్రిటిష్ ఆక్రమణ తర్వాత బ్రిటన్ రాణి క్వీన్ విక్టోరియా స్వాధీనంలోకి వచ్చింది. అంతకు ముందు జమ్మూ కాశ్మీర్ ఒకటవ వ మహారాజు గులాబ్ సింగ్ స్వాధీనంలో వుండేది.
వాస్తవానికి, ఈ రాయి ఇతర మొఘల్-యుగపు వజ్రాలైన ప్రస్తుతం ఇరాన్ క్రౌన్ ఆభరణాలలో భాగమైన దర్యా-ఇ-నూర్ కు సమానమైన కోతతో వుండేది. 1851లో, ఇది లండన్లోని గ్రేట్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు, కాని పేలవమైన కోతతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. క్వీన్ విక్టోరియా భర్త ప్రిన్స్ ఆల్బర్ట్ దీనిని కోస్టర్ డైమండ్స్ చేత అండాకారపు కాంతివెలుగుతో తిరిగి కత్తిరించాలని ఆదేశించాడు. ఆధునిక ప్రమాణాల ప్రకారం, క్యూలెట్ (రత్నం దిగువన ఉన్న స్థానం) అసాధారణంగా విస్తృతంగా ఉంటుంది, రాయిని పైనుండి చూసినప్పుడు ఇది అగాధమైన చీకటిగా వుంటుంది. అయినప్పటికీ దీనిని రత్న శాస్త్రవేత్తలు "జీవితంతో నిండినది" గా భావిస్తారు. [7]
చరిత్రలో కో-ఇ-నూర్ ధరించిన ఏ పురుషులకైనా దురదృష్టం తెచ్చిపెట్టినందున బ్రిటిష్ రాజ కుటుంబంలోని మహిళలు మాత్రమే ధరిస్తారు. [8] విక్టోరియా రాణి దీనిని బ్రూచ్, సర్క్ లెట్ లో భాగంగా ధరించింది. 1901 లో ఆమె మరణించిన తరువాత, ఇది ఎడ్వర్డ్ VII భార్య అలెగ్జాండ్రా రాణి కిరీటంలో ఉంచబడింది. ఇది 1911 లో మేరీ రాణి కిరీటానికి, 1937 లో పట్టాభిషేకం జరిగిన ఎలిజబెత్ రాణి కిరీటానికి బదిలీ చేయబడింది.
ప్రస్తుతం ఈ వజ్రం లండన్ టవర్ వద్ద ఉన్న జ్యువెల్ హౌస్ లో బహిరంగ ప్రదర్శనలో ఉంది. దీనిని ప్రతి సంవత్సరం లక్షల సందర్శకులు సందర్శిస్తారు. 1947 లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత, భారతదేశం, పాకిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాలు కో-ఇ-నూర్ తమకే చెందుతుందని ప్రకటించాయి, తమకు తిరిగి ఇవ్వాలని కోరాయి .లాహోర్ చివరి ఒప్పందం నిబంధనల ప్రకారం రత్నాన్ని చట్టబద్ధంగా పొందినందున బ్రిటిష్ ప్రభుత్వం వాదనలను తిరస్కరించింది.