శ్యాంప్రసాద్ ముఖర్జీ
భారత రాజకీయ నాయకుడు / From Wikipedia, the free encyclopedia
1901, జూలై 6 న జన్మించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రముఖ జాతీయవాద నేతలలో ముఖ్యుడు. 1951లో భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన ముఖర్జీ ఆధునిక హిందుత్వ, హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించాడు. హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడైన శ్యాం ప్రసాద్ ముఖర్జీ, జనసంఘ్ను స్థాపించి దేశంలో తొలి హిందూవాద రాజకీయ పార్టీని స్థాపించిన నేతగా స్థానం పొందినాడు. కలకత్తా విశ్వవిద్యాలయం కులపతిగా పనిచేసిన అశుతోష్ ముఖర్జీ కుమారుడైన శ్యాంప్రసాద్ ముఖర్జీ కోల్కత లోనే ఉన్నత విద్యాభ్యాసం అభ్యసించి ప్రారంభంలో కాంగ్రెసు వాదిగానే రాజకీయ జీవితం ఆరంభించాడు. స్వాతంత్ర్యానికి పూర్వం జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా పనిచేశాడు. 1949లో ఢిల్లీ ఒప్పందానికి వ్యతిరేకంగా కాంగ్రెసు పార్టీ నుంచి తప్పుకొని అక్టోబర్ 21, 1951 న జనసంఘ్ పార్టీని స్థాపించి, ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా మే 23, 1953 న మరణించేవరకు కొనసాగినాడు.
శ్యాంప్రసాద్ ముఖర్జీ | |||
నిర్వహించిన పదవులు జనసంఘ్ పార్టీ సంస్థాపక అధ్యక్షుడు కోల్కత విశ్వవిద్యాలయం మాజీ కులపతి మాజీ కేంద్ర మంత్రి | |||
వ్యక్తిగత వివరాలు |
|||
---|---|---|---|
జననం | జూలై 6, 1901 కోల్కత | ||
మరణం | జూన్ 23, 1953 | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనసంఘ్ | ||
డిసెంబర్ 26, 2008నాటికి |