పురోహితుడు
From Wikipedia, the free encyclopedia
పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి : పుర హితవు కోరే పోరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా గుర్తించి వారిని సామాజికంగా,ఆర్ధికంగా రాజకీయంగా ఆదుకోవలసిన భాధ్యత ప్రభుత్వాలపై ఉంది.ప్రతి కులానికి కుల వృత్తి ఉంది కమ్మై కుమ్మరి వడ్రంగి అలా అందరికీ కు వృత్తి కేటాయించి వారి వారి వృత్తులలో రాయితీలు అందించి వారు ఆర్ధికంగా నిలదొక్కుకొనేందుకు చేయూతనిస్తున్నాయి.
అయితే సమాజ శ్రేయస్సే పరమావధిగా సర్వేజనాః సుఖినోభవంతు అంటూ హైదవ ధర్మాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్న పౌరోహిత్యాని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం బ్రాహ్మణ కుల వృత్తిగా గుర్తించాలని ఆంద్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య విజ్నప్తి చేస్తోంది.
డు అనగా ముందుగా హితము పలికెడి వాడు అని అర్థం. అనగా,మనము ఏదైన పనిచేయబోయినప్పుడు, ముందుగా, అతనిని సంప్రదిస్తే, ఆ పని చేయడం లోని మంచి, చెడ్డలను చెప్పి, ఆ పని చేయడం యోగ్యమయిన దయితే, దానిని నిర్వర్తించే విధానం తెలిపేవాడు పురోహితుడు. అందు వలన, ఒకపనిని, స్వప్రయోజనాన్ని ఆశించిగాని, లేదా ఇతర కారణముల వలన గాని మన చేత చేయిస్తే, దాని వలన వచ్చే పాపము పురోహితునికే వెడుతుందిగాని, మనకు కాదు. అందువలన, ఏపనిచేయడానికైనా ముందుగా పురోహితుని అనుజ్ఞ తీసుకోవాలి. పాలకుడైన వాడు పాలితుల( ప్రజల ) పాపములకు బాధ్యుడు, పాలకుని పాపములకు పురోహితుడు బాధ్యుడు.
రాజా రాష్ట్రకృతం పాపం
రాజ పాపం పురోహితః
అని ఆర్యోక్తి.
పురోహితుడు చేసే పనిని పౌరోహిత్యము అంటున్నారు. పూర్వకాలంలో, రాజ్యానికి శుభములు సమకూడేందుకు, పరరాజుల దండయాత్రల వంటి విషమ పరిస్థితులలోను మంత్రి, పురోహితులతో రాజు సమాలోచనలు జరిపేవాడు. పురోహితునికి సాధారణమైన పేరు వశిష్ఠుడు.
వివాహాది షోడశకర్మలు జరుపడానికి, ముందుగా, వసిష్టులవారిని ఆహ్వానించి, గౌరవించి, తలపెట్టిన శుభకార్యాన్ని జయప్రదంగా జరుప వలసినదని కోరాలి.
ఇప్పుడు పౌరోహిత్యము చేయువానిని పురోహితుడు అంటారు. పౌరోహిత్యము సాధారణముగా బ్రాహ్మణులు చేయుచుందురు. ప్రస్తుతం వివిధ కులాలకు సంబందించిన వారు కూడా పౌరోహిత్యము నిర్వర్తిస్తున్నారు.