2016 భారత సర్జికల్ దాడులు
From Wikipedia, the free encyclopedia
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులో ఉన్న ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లపై, నియంత్రణ రేఖను దాటి, " సర్జికల్ దాడులు" చేసినట్లు 2016 సెప్టెంబరు 29 న భారతదేశం ప్రకటించింది. ఈ దాడుల్లో "గణనీయమైన ప్రాణనష్టం" కలగ చేసింది. [10] దాడుల్లో 35 నుండి 70 వరకు మృతులు, క్షతగాత్రులూ ఉన్నట్లు భారతీయ మీడియా రాసింది. [11] [12] తమ సైనికులు ఇద్దరు మరణించినట్లు, తొమ్మిది మంది గాయపడినట్లూ పాకిస్తాన్ అంగీకరించింది. ఎదురుకాల్పుల్లో కనీసం ఎనిమిది మంది భారత సైనికులు మరణించారని, ఒకరు పట్టుబడ్డారనీ పాకిస్తాన్ వర్గాలు తెలిపాయి. తమ సైనికుల్లో ఒకరు పాకిస్థానీ కస్టడీలో ఉన్నట్లు భారత్ ధృవీకరించింది. అయితే దానికీ ఈ సంఘటనకూ సంబంధం లేదనీ, తమ సైనికులు ఎవరూ చనిపోలేదనీ భారతదేశంచ్ చెప్పింది. [13] భారత్ తన ప్రాణనష్టాన్ని దాస్తోందని పాకిస్తాన్ పేర్కొంది.
| ||||||||||||||||||||||||||||||||||||||||||
"దాడి" కి సంబంధించిన వివరాలు ఇంకా అస్పష్టంగా ఉన్నాయని మీడియా సంస్థలు ప్రకటించాయి. [14] ఆ నెల లోనే, సెప్టెంబరు 18 న, జమ్మూ కాశ్మీర్ లోని ఉరీ వద్ద నలుగురు ఉగ్రవాదులు భారత సైన్యంపై దాడి చేసి 19 మంది సైనికులను హతమార్చారు. సర్జికల్ దాడి చేసినట్లు సెప్టెంబరు 29 న భారత్ అంగీకరించడం, తమ బలగాలు నియంత్రణ రేఖను దాటినట్లు భారత్ బహిరంగంగా అంగీకరించిన మొదటి సంఘటన. [15] [16] తరువాతి రోజులూ నెలల్లో, భారత, పాకిస్తాన్లు కాశ్మీర్ సరిహద్దులో కాల్పులు చేసుకుంటూనే ఉన్నాయి. దీని ఫలితంగా రెండు వైపులా డజన్ల కొద్దీ సైనికుల, పౌరుల మరణాలు సంభవించాయి.