2011 తమిళనాడు శాసనసభ ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
ఎఐఎడిఎంకె కూటమి 203 నియోజకవర్గాల్లో విజయం సాధించింది; ఏఐఏడీఎంకే పార్టీ ఒక్కటే 150 సీట్లు గెలుచుకుని, భారీ మెజారిటీని సాధించింది. దాని సంకీర్ణ భాగస్వాముల మద్దతు అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అర్హత సాధించింది. డిఎమ్డికె 29 సీట్లు గెలుచుకుని, డీఎంకే గెలుచుకున్న 23 సీట్ల కంటే ఎక్కువ సాధించింది. అది అధికారిక ప్రతిపక్ష పార్టీగా పనిచేయాలని నిర్ణయించుకుంది. ఈ ఎన్నికలు డిఎంకె ప్రభుత్వంపై రెఫరెండం అని రాజకీయ విశ్లేషకులు నిర్ధారించారు. అధికార వ్యతిరేక సెంటిమెంట్ ఎఐఎడిఎంకె సంకీర్ణానికి సహాయపడింది. జె. జయలలితను 33 మంది మంత్రులతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా నాల్గవసారి 2011 మే 16 న గవర్నర్ సుర్జిత్ సింగ్ బర్నాలా ప్రమాణ స్వీకారం చేయించాడు.
త్వరిత వాస్తవాలు మొత్తం 234 స్థానాలన్నింటికీ మెజారిటీ కోసం 118 సీట్లు అవసరం, వోటింగు ...
| |||||||||||||||||||||||||||||||||||||||||||
మొత్తం 234 స్థానాలన్నింటికీ మెజారిటీ కోసం 118 సీట్లు అవసరం | |||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
వోటింగు | 78.29% (7.73%) | ||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||
|
మూసివేయి