హల్దీఘాటీ యుద్ధం
From Wikipedia, the free encyclopedia
హల్దీఘాటీ యుద్ధం 1576 జూన్ 18 న [lower-alpha 1] మహారాణా ప్రతాప్ నేతృత్వంలోని మేవార్ దళాలు, అంబర్ కు చెందిన మాన్ సింగ్ I నేతృత్వంలోని మొఘల్ దళాల మధ్య జరిగిన యుద్ధం. మొఘలులు మేవార్ దళాలకు గణనీయమైన ప్రాణనష్టం కలిగించి యుద్ధంలో విజయం సాధించారు. రాణా ప్రతాప్ తోటి సైనికాధికారుల బలవంతంపై యుద్ధరంగం విడిచి వెళ్ళిపోయాడు. దాంతో మొగలు సైన్యం అతన్ని పట్టుకోలేకపోయింది.
హల్దీఘాటీ యుద్ధం | |||||||
---|---|---|---|---|---|---|---|
మొగలు-రాజపుత్ర యుద్ధాలులో భాగము | |||||||
చిత్రకారుడు ఛొక్క వేసిన యుద్ధ చిత్రం, 1822 | |||||||
| |||||||
ప్రత్యర్థులు | |||||||
Mewar Kingdom | మొగలు సామ్రాజ్యం | ||||||
సేనాపతులు, నాయకులు | |||||||
| |||||||
బలం | |||||||
3,000 కాల్బలం 400 భిల్లు విలుకాండ్రు సంఖ్య తెలీని ఏనుగులు | 10,000 మంది సైనికులు సంఖ్య తెలీని ఏనుగులు[8] | ||||||
ప్రాణ నష్టం, నష్టాలు | |||||||
500 మంది మరణించారు (అబుల్ ఫజల్ ప్రకారం) 1,600 జననష్టం (మేవారీ వర్గాల ప్రకారం) | 150 మరణాలు (అబుల్ ఫజల్ ప్రకారం) | ||||||
ఆ యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూచిన బదయూనీ, ఇరుపక్షాల్లోను 500 మంది మరణించారని, వారిలో 120 మంది ముస్లిములనీ చెప్పాడు. | |||||||
1568లో చిత్తోర్గఢ్ ముట్టడితో మేవార్ రాజ్యం లోని సారవంతమైన తూర్పు బెల్ట్ను మొఘల్ల హస్తగతమైంది. అయితే, చెట్లతో కొండలతో కూడిన మిగతా రాజ్యం సిసోడియాల నియంత్రణ లోనే ఉండిపోయింది. మేవార్ గుండా గుజరాత్ వెళ్ళేందుకు ఒక సుస్థిరమైన మార్గం కావాలని అక్బరు భావించాడు. 1572లో ప్రతాప్ సింగ్ రాజుగా (రాణా) పట్టాభిషిక్తుడైనప్పుడు అక్బరు, ఈ ప్రాంతం లోని అనేక ఇతర రాజపుత్ర నాయకుల మాదిరిగానే రాణాను సామంతుడిగా మారమని కోరుతూ అనేక మంది రాయబారులను పంపాడు. అయితే, ప్రతాప్ అలాంటి ఒప్పందం కుదుర్చుకోవడానికి నిరాకరించడంతో యుద్ధం అనివార్యమైంది.
యుద్ధం జరిగిన ప్రదేశం రాజస్థాన్లోని గోగుండా సమీపంలోని హల్దీఘాటి వద్ద నున్న ఇరుకైన కనుమ మార్గం. ఇరు సైన్యాల సంఖ్యపై విభిన్న అభిప్రాయాలున్నప్పటికీ, మొఘలు సైన్యం మేవార్ సైన్యం కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని నిర్ధారించారు. తొలుత మేవారీలది పైచేయిగా ఉన్నప్పటికీ, పరిస్థితి నెమ్మదిగా వారికి వ్యతిరేకంగా మారింది. రాణా ప్రతాప్ గాయపడ్డాడు. మొఘలులు యుద్ధంలో గెలిచినందున, ఝాలా మాన్ సింగ్ ఆధ్వర్యంలో కొంతమంది వ్యక్తులు రక్షక వలయంగా ఉంటూ రాణా తప్పించుకునేందుకు సహకరించారు.
హల్దీఘాటి వద్ద తిరోగమనం జరిగినప్పటికీ, గెరిల్లా యుద్ధాల ద్వారా మొఘల్లకు వ్యతిరేకంగా ప్రతాప్ తన ప్రతిఘటనను కొనసాగించాడు. అతని మరణం నాటికి అతని పూర్వీకుల రాజ్యాన్ని తిరిగి సాధించాడు.