శాంతి స్వరూప్ భట్నాగర్ శాస్త్ర సాంకేతిక పురస్కారం
From Wikipedia, the free encyclopedia
శాంతి స్వరూప్ భట్నాగర్ (SSB) శాస్త్ర, సాంకేతిక పురస్కారం భారతదేశంలో ప్రతీ సంవత్సరం కౌన్సిల్ ఆఫ్ సెంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ద్వారా ప్రముఖ శాస్త్ర పరిశోధకులకు అందజేయబడుతున్న శాస్త్ర పురస్కారం. ఈ పురస్కారాలను శాస్త్ర రంగాలైన జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, పర్యావరణ శాస్త్రం, ఇంజనీరింగ్, గణితశాస్త్రం, వైద్యరంగం, భౌతిక శాస్త్రాలలో అసమాన ప్రతిభ కనబరచిన వారికి అందజేస్తారు. ఈ పురస్కారం భారతీయ శాస్త్ర, సాంకేతిక రంగాలలో మంచి గుర్తింపు తెచ్చిన వారికి అంజజేయబడుతుంది. ఇది భారతదేశంలోని శాస్త్ర రంగంలో అతి గౌరవనీయమైన పురస్కారం.[1] ఈ పురస్కారానికి భారతదేశ కౌన్సిల్ ఆఫ్ సెంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసెర్చ్ స్థాపకుడైన శాంతిస్వరూప్ భట్నాగర్ పేరును పెట్టారు.[2] ఈ పురస్కారం మొదటిసారి 1958 లో యివ్వబడింది.
భారతదేశ పౌరినిగా ఉన్న వ్యక్తి తన 45 సంవత్సరాల వయసు వరకు శాస్త్ర, సాంకేతిక రంగాలలో పరిశోధన చేస్తూ ఉంటే ఈ పురస్కారానికి అర్హత పొందుతాడు. ఈ పురస్కారాన్ని పొందవలసిననాటి నుండి ముందు ఐదు సంవత్సరాలపాటు ఆయన చేసిన కృషి ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఈ పురస్కారం ఒక పతకం, నగదు బహుమతి ₹5 lakh (US$6,300).[3] అందజేయబడుతుంది. అదనంగా ఆ పురస్కార గ్రహీత 65 వ సంవత్సరం వరకు ప్రతీ నెలా రూ. 15,000 అందజేయబడుతుంది.