వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2018 20వ వారం
From Wikipedia, the free encyclopedia
హైదర్ ఆలీ దక్షిణాదిన ఉన్న మైసూర్ రాజ్యం యొక్క వాస్తవ పాలకుడు. అతడి అసలు పేరు హైదర్ నాయక్. సైనిక విజయాలతో ప్రత్యేకతను చాటుకొని ఆనాటి మైసూరు పాలకుల దృష్టిని ఆకర్షించగలిగాడు. రెండవ కృష్ణరాజ వొడయారుకు దళవాయి (సర్వ సైన్యాధిపతి) గా ఎదగడం ద్వారా ఆయన రాజు, మైసూరు ప్రభుత్వంపై పెత్తనాన్ని సాధించి క్రమక్రమంగా అన్ని రకాల అధికారాలపై అదుపు సాధించాడు. అతను తన రాజ్యం యొక్క సరిహద్దులను మరాఠా సామ్రాజ్యం మరియు నిజాం హైదరాబాదు వరకు విస్తరించాడు. హైదర్ ఆలీ బ్రిటిషు ఈస్టిండియా కంపెనీ సైనిక విస్తరణను సమర్థవంతంగా అడ్డుకున్న కొద్దిపాటి స్థానిక పాలకులలో ఒకడు. రెండు ఆంగ్ల-మైసూరు యుద్ధాలలో ఆయన బ్రిటిషు స్థావరమైన మద్రాసుకు అతి సమీపానికి రాగలిగాడు. అతను సుల్తాన్ హైదర్ ఆలీ ఖాన్, హైదర్ ఆలీ సాహిబ్ లాంటి అనేక గౌరవబిరుదాలను అందుకున్నాడు. హైదర్ ఆలీ పాలన తన పొరుగువారితో తరుచుగా జరిగే యుధ్ధాలతోను మరియు తన రాజ్యం లోపల జరిగే తిరుగుబాటులతోను కూడిఉంది. ఇది ఆ కాలంలో అసాధారణమైన విషయమేమీ కాదు. నిజానికి అప్పుడు భారత ఉపఖండంలో ఎక్కువభాగం సంక్షోభంలో ఉంది. మరాఠా సమాఖ్య మొఘల్ సామ్రాజానికి చెందిన అధికారులతో పోరాడుతున్నది. అతను ఒక మంచి తెలివి గల నేత. తను పాలన చేపట్టినప్పుటి కంటే పెద్ద రాజ్యాన్ని తన కుమారుడు టిప్పు సుల్తానుకు వదిలివెళ్ళాడు. అతను తన సైన్యాన్ని ఐరోపా సైన్యపు పధ్ధతులలో వ్యవస్థీకరించాడు.
(ఇంకా…)