రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్
From Wikipedia, the free encyclopedia
రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW or Research and Analysis Wing) భారత గూఢచార సంస్థ. 1962 లో జరిగిన భారత-చైనా యుద్ధం, 1965న జరిగిన భారత-పాకిస్థాన్ యుద్ధం తరువాత విదేశాలపై గట్టి నిఘా ఉంచేందుకు ఒక సంస్థ అవసరం ఏర్పడింది.[1][2][2][3][4] 1968 సెప్టెంబరులో రాను ఇంటలిజెన్స్ బ్యూరో నుంచి వేరుచేసి ఒక సంస్థగా ఏర్పాటుచేసారు. ఇంటెలిజన్స్ బ్యూరో అప్పటికి భారతదేశం లోపల వెలుపల నిఘా కార్యక్రమాలు చూసేది. రా ముఖ్యకార్యాలయం ఢిల్లీలోని, లోధిరోడ్ లో ఉంది.
రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (R&AW) | |
---|---|
విభాగం అవలోకనం | |
స్థాపనం | 21 సెప్టెంబరు 1968; 55 సంవత్సరాల క్రితం (1968-09-21) |
ప్రధాన కార్యాలయం | సిజిఓ కాంప్లెక్స్, న్యూఢిల్లీ, భారతదేశం |
నినాదం | धर्मो रक्षति रक्षितःपरमो धरम (Sanskrit) (law protects, when it is protected) |
Parent విభాగం | క్యాబినెట్ సెక్రటేరియట్ |
Child agencies | ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నికల్ సర్వీసెస్ (ETS) రేడియో రీసెర్చ్ సెంటర్ స్పెషల్ గ్రూప్ |
వెబ్సైటు | |
http://www.allgov.com/india/departments/ministry-of-youth-affairs-and-sports/research-and-analysis-wing?agencyid=7606 |
ఇంటలిజెన్స్ బ్యూరోని బ్రిటీష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సంజీవి పిళ్ళై డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకొన్న తరువాత అనుభవజ్ఞులైన గూఢచారుల కొరత బాగా కనబడింది. 1962 భారత - చైనా,1965 భారత - పాకిస్తాన్ యుద్ధాలలో ఇంటలిజెన్స్ బ్యూరో వైఫల్యం బాగా కనబడింది.
1966 తరువాత ప్రత్యేక విదేశీ నిఘా సంస్థ ప్రారంభానికి గట్టి చర్యలు తీసుకొన్నారు. 1968 లో ఇందిరా గాంధీ హయాంలో ఇటువంటి సంస్థ అవసరం బాగా వచ్చింది. ఆర్.ఎన్. కావ్ అప్పటికి ఇంటలిజెన్స్ బ్యూరో డిప్యూటి డైరెక్టర్. అతను ఇటువంటి సంస్థకు గల వివరాలతో గల బ్లూప్రింట్ ను ప్రధానికి ఇచ్చాడు. అప్పుడు 'రా' ఏర్పడి, అతనే 'రా' కు చీఫ్ గా నియమించబడ్డాడు.