రామానంద్ సాగర్
From Wikipedia, the free encyclopedia
రామానంద్ సాగర్ (29 డిసెంబర్ 1917[1] – 12 డిసెంబర్ 2005[1]) (జన్మనామం చంద్రమౌళి చోప్రా) ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు. దూరదర్శన్లో ప్రసారమై విశేష జనాదరణ పొందిన ధారావాహిక "రామాయణ్"ను ఇతడు నిర్మించాడు. 78 భాగాల ఈ టెలివిజన్ ధారావాహిక భారతీయ పురాతన ఇతిహాసం రామాయణం ఆధారంగా తీయబడింది. ఈ సీరియల్లో రామునిగా అరుణ్ గోవిల్, సీతగా దీపికా చికాలియా నటించారు.[2] భారత ప్రభుత్వం ఇతడిని 2000వ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.[3]
త్వరిత వాస్తవాలు రామానంద్ సాగర్, జననం ...
రామానంద్ సాగర్ | |
---|---|
జననం | చంద్రమౌళి చోప్రా (1917-12-29)1917 డిసెంబరు 29 |
మరణం | 2005 డిసెంబరు 12(2005-12-12) (వయసు 87) |
ఇతర పేర్లు | రామానంద్ చోప్రా రామానంద్ బేడి రామానంద్ కాశ్మీరీ |
వృత్తి | చలనచిత్ర నిర్మాత, దర్శకుడు, రచయిత |
జీవిత భాగస్వామి | లీలావతి |
పిల్లలు | ఆనంద్ సాగర్, ప్రేమ్ సాగర్, మోతీ సాగర్, సుభాష్ సాగర్, శాంతి సాగర్, సరితా చౌదరి |
పురస్కారాలు | పద్మశ్రీ పురస్కారం (2000) |
మూసివేయి