మెసొపొటేమియా నాగరికత
From Wikipedia, the free encyclopedia
మెసొపొటేమియాఅనే పదం (గ్రీకు నుండి తీసుకోబడింది. దీనికి అరబికు భాషలో అర్ధం Μεσοποταμία "నదుల మధ్య [భూమి]"(అరబిక్ లోبلاد الرافدينగా) అన్వయించబడింది bilād al-rāfidayn )[1] భౌగోళిక వర్ణన అధారితంగా స్వికరించబడిన ఈ పేరుకు తగినట్లుగా ఇది టైగ్రిసు-యూఫ్రేట్సు నదీవ్యవస్థ ప్రాంతంగా ఉంది. ఆధునిక ఇరాక్కు అధికంగా టైగ్రిసు, యూఫ్రేట్సు నదీజలాలు అధికంగా సహకరిస్తున్నాయి.[2] అలానే ఇది ఈశాన్య సిరియా కొన్ని ఖండాలు,[2] టర్కీ కొన్ని దక్షిణతూర్పు ప్రాంతాలు, ఇరాన్ దక్షితూర్పు ఖుజెస్థాను జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు వర్తిస్తుంది.[3][4]
దీనిని నాగరికత సంరక్షణగా విస్తారంగా భావించబడింది, కంచుయుగం మెసొపొటేమియా సుమేరు, అక్కాడియను, బాబిలోనియా ఇంకా అస్సిరియా సామ్రాజ్యాలను కలుపుకుంది. ఇనుప యుగం లో, నూతన-అస్సిరియా, నూతన-బాబిలోనియా సామ్రాజ్యలు పరిపాలించాయి. వేరే దేశంకు చెందిన సుమేరియన్ల, అక్కాడియన్ల (వీరిలో అస్సిరియన్లు & బాబిలోనియన్లు ఉన్నారు) అధీనంలో దాదాపు చరిత్ర వ్రాయబడిన క్రీ.పూ.3100 నాటినుండి క్రీ.పూ.539 లో బాబిలోను పతనం వరకు ఉంది. ఇది తర్వాత దీనిని అచమెనిదు సామ్రాజ్యం జయిచింది. క్రీ.పూ.332లో దీనినిఅలెగ్జాండరు ఆక్రమించాడు. అలెగ్జాండరు మరణం తర్వాత గ్రీకు సెల్యుసిడు సామ్రాజ్యంలో భాగమయ్యింది. క్రీ.పూ. 150 నాటికి మెసొపొటేమియా పార్థియన్ల నియంత్రణలోకి వచ్చింది. మెసొపొటేమియాలోని కొన్ని భాగాలు (ముఖ్యంగా అస్సిరియ) క్రమముగా రోమను నియంత్రణలోకి రావడంవల్ల మెసొపొటేమియా రోమన్ల, పార్థియన్ల యుద్దభూమిగా అయ్యింది. సా.శ. 226 లో సస్సానిదు పర్షియన్ల ఆక్రమణలోకి వెళ్ళింది. సా.శ. 7వ శతాబ్దంలో సస్సానిదు సామ్రాజ్యం విజయం వరకు ఇది పర్షియన్ల ఆక్రమణలో ఉంది. క్రీ.పూ.1 వ శతాబ్దం నుండి సా.శ. 3వ శతాబ్దం వరకు అనేక మెసొపొటేమియా రాజ్యాలు ఉద్భవించాయి; అడియబెను, ఒష్రోయను, హత్రా.