ముత్తుస్వామి దీక్షితులు
From Wikipedia, the free encyclopedia
ముత్తుస్వామి దీక్షితర్(1775-1835) కర్ణాటక సంగీతత్రయంలో ఒకరైన వాగ్గేయకారుడు, వీణ విద్వాంసుడు. వీరి కృతులు తెలుగు కంటే ఎక్కువగా సంస్కృతంలో రాయబడ్డాయి. వీరు కొన్ని కృతులు మణిప్రవాలం (తమిళము, సంస్కృతాల సమ్మేళనం)లో కూడా రాయబడ్డాయి. "గురు గుహ" అనేది వీరి మకుటం. వీరి అన్ని రచనాల్లోనూ అది కనిపిస్తుంది. వీరు మొత్తం 500లకు పైగా కీర్తనలు రాసారు. వీరు సంగీత, వ్యాకరణ, జ్యోతిష, వాస్తు, మాంత్రిక, వైద్య విద్యలలో ఆరితేరిన వ్యక్తి.
త్వరిత వాస్తవాలు ముత్తుస్వామి దీక్షితులు, వ్యక్తిగత సమాచారం ...
ముత్తుస్వామి దీక్షితులు | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
మూలం | తిరువారూర్, తంజావూరు, భారతదేశం |
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వృత్తి | కర్ణాటక సంగీతం, వాగ్గేయకారుడు |
మూసివేయి