మాతాజీ నిర్మలాదేవి
From Wikipedia, the free encyclopedia
మాతాజీ నిర్మలాదేవి (జననం 1923 మార్చి 21 - 2011 ఫిబ్రవరి 23) సహజ యోగ ఉపాసకురాలు. యోగం వ్యాప్తికి విశేషకృషి చేసింది.[1][2][3][4][5]
త్వరిత వాస్తవాలు మాతాజీ నిర్మలాదేవి, జననం ...
మాతాజీ నిర్మలాదేవి | |
---|---|
జననం | (1923-03-21)1923 మార్చి 21 చింద్వారా, మధ్యప్రదేశ్, భారతదేశం |
మరణం | 2011 ఫిబ్రవరి 23(2011-02-23) (వయసు 87) జెనోవా, ఇటలీ |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | సహజ యోగం |
జీవిత భాగస్వామి | చంద్రికా ప్రసాద్ శ్రీవాస్తవ
(m. 1947) |
వెబ్సైటు | http://www.sahajayoga.org/ |
మూసివేయి
యోగం అంటే యోగాసనాలు, ప్రాణాయామం మాత్రమే కాదని, యోగం అంటే మనం విశ్వసించే సర్వవ్యాపితుడైన భగవంతునితో అనుసంధానం చేసుకోవడమనే వాదనను సమర్థవంతంగా వినిపించి ఆమె అందరినీ ఒప్పించింది. ఇదే విశ్వ నిర్మల ధర్మం అని ఆమె చాటిచెప్పింది. దీనికి ఉపయుక్తం అయిన సహజయోగ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడానికి, భారతదేశంతో పాటు, దాదాపు 120 దేశాల్లో పర్యటించింది.[6]