మంగళంపల్లి బాలమురళీకృష్ణ
ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు. పద్మవిభూషణ్ పురస్కారగ్రహీత.చలనచిత్ర నటుడు. / From Wikipedia, the free encyclopedia
మంగళంపల్లి బాలమురళీకృష్ణ (జూలై 6, 1930 - నవంబర్ 22, 2016) కర్ణాటక సంగీత గాయకుడు, వయొలిన్ విద్వాంసుడు, వాగ్గేయకారుడు, సినీ సంగీత దర్శకుడు, గాయకుడు.[1][2] ప్రపంచ వ్యాప్తంగా 25 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాడు.[1] 8 సంవత్సరాల అతి చిన్న వయసులోనే కచేరీ చేయడం ద్వారా బాలమేధావి అనిపించుకున్నారు. 1939నుంచీ అతను ప్రొఫెషనల్ కచేరీలు చేస్తూనే ఉన్నాడు. అతను వయోలిన్, మృదంగం, కంజీరా లాంటి వాయిద్యాలన్నీ బాగా వాయించగలడు. భక్తప్రహ్లాద సినిమాలో నారదుడిగా, సందెని సింధూరం అనే మలయాళం సినిమాలో నటించాడు. పలు చిత్రాలకు అతను సంగీతాన్ని అందించారు. పద్మభూషణ్, డాక్టరేట్లను వంటి బిరుదులను పొందాడు. ప్రపంచ స్థాయిలో చేవెలియర్ అఫ్ ఆర్డర్ అఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ గౌరవాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం నుండి అందుకున్నారు.[3] చెన్నై లోని తన స్వగృహంలో, మధ్యాహ్న భోజనం తరువాత నిద్రించి నిద్రలోనే అనాయాస మరణం పొందాడు.
మంగళంపల్లి బాలమురళీకృష్ణ | |
---|---|
జననం | మంగళంపల్లి బాలమురళీకృష్ణ జూలై 6, 1930 శంకరగుప్తం, రాజోలు తాలుకా, తూర్పు గోదావరి జిల్లా |
మరణం | నవంబర్ 22, 2016 |
నివాస ప్రాంతం | చెన్నై , తమిళనాడు |
ఇతర పేర్లు | మంగళంపల్లి |
వృత్తి | కర్ణాటక సంగీత విద్వాంసులు |
ప్రసిద్ధి | కర్ణాటక సంగీత విద్వాంసులు |
పదవి పేరు | పద్మ విభూషణ |
మతం | హిందు |
తండ్రి | మంగళంపల్లి పట్టాభిరామయ్య |
తల్లి | సూర్యకాంతమ్మ |