భూమా శోభా నాగిరెడ్డి
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకురాలు, ఆళ్ళగడ్డ శాసనసభ్యులుగా పనిచేశారు. / From Wikipedia, the free encyclopedia
శోభా నాగిరెడ్డి (నవంబరు 16 1968 – ఏప్రిల్ 24 2014) [2] ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలు. ఆమె ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గంలో 2012లో ఆమె రాజీనామా చేసిన వరకు నాలుగు సార్లు శాసన సభ్యురాలిగా ఉన్నారు.[3] ఆమె ఆంధ్రప్రదేశ్ రోడ్దు రవాణా సంస్థలో చైర్ పర్సన్ గా కూడా పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు. ఆమె అంతకు పూర్వం తెలుగు దేశంపార్టీలో రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా కూడా పనిచేశారు. 2012 లో ఆమె ప్రజారాజ్యం పార్టీని వీడి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె భర్త భూమా నాగిరెడ్డి కూడా ప్రముఖ రాజకీయనాయకులు. ఆయన రెండుసార్లు శాసనసభ్యునిగానూ, మూడుసార్లు పార్లమెంట్ సభ్యునిగానూ పనిచేశారు. ఆమె కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసన సభ్యులు, అసెంబ్లీలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు అయిన శోభా నాగిరెడ్డి చురుకైన నేత.
శోభా నాగిరెడ్డి | |||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు. | |||
నియోజకవర్గం | ఆళ్ళగడ్డ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1968-11-16)1968 నవంబరు 16 ఆళ్ళగడ్డ, ఆంధ్రప్రదేశ్, భారతదేశము | ||
మరణం | 2014 ఏప్రిల్ 24(2014-04-24) (వయసు 45) హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, భారతదేశము | ||
రాజకీయ పార్టీ | యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | భూమా నాగిరెడ్డి | ||
సంతానం | భూమా అఖిల ప్రియ, భూమా నాగ మౌనిక, భూమా విఖ్యాత్[1] |