భూమధ్య రేఖ
From Wikipedia, the free encyclopedia
భూమధ్య రేఖ, భూ ఉపరితలం మీద ఉత్తర దక్షిణ ధ్రువాల నుండి సమాన దూరంలో ఉండే ఊహా రేఖ. ఇది భూగోళాన్ని ఉత్తరార్థ, దక్షిణార్థ గోళాలుగా విభజిస్తుంది. భూమధ్య రేఖ 48,075 కి.మీ. పొడవుంటుంది. ఇది 78.7% నీటిలోను, 21.3% నేలమీదుగానూ పోతుంది.
ఇతర గ్రహాలు, ఖగోళ వస్తువులకు కూడా ఇదే విధంగా మధ్య రేఖ ఉంటుంది. సాధారణంగా, గుండ్రంగా తిరుగుతున్న గోళం యొక్క భ్రమణాక్షానికి లంబంగా ఉన్న తలం, గోళపు ఉపరితలాన్ని ఖండించే రేఖను మధ్య రేఖ అంటారు. ఇది ఆ గోళపు రెండు ధ్రువాలకూ సమదూరంలో ఉంటుంది.