భారతీయ మహిళా ముఖ్యమంత్రుల జాబితా
From Wikipedia, the free encyclopedia
భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు 2018 నాటికి మొత్తంగా 16 మంది మహిళలు ముఖ్యమంత్రులుగా పనిచేశారు.[1] ప్రస్తుతం వారిలో వసుంధరా రాజే, మమతా బెనర్జీ, మెహబూబా ముఫ్తీలు ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారు. ఈ 13 రాష్ట్రాల్లో కేవలం ఒకసారే మహిళా ముఖ్యమంత్రులు ఎన్నిక అవ్వగా, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్లలో రెండుసార్లు మహిళా అభ్యర్థులు ఎన్నికవడం విశేషం. ఈ పదహారు మంది మహిళా ముఖ్యమంత్రుల్లో కాంగ్రెస్కు చెందిన వారు అయిదుగురు, బిజెపి ముఖ్యంత్రులు నలుగురు, ఇద్దరు ఏఐడిఎంకె కు చెందినవారు ఉన్నారు. భారతదేశ మొట్ట మొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేతా కృపలానీ 1963-67 వరకు అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుచేతా కృపలానీ నైపుణ్యం, పారదర్శక పరిపాలనను నిరూపించారు. తన పదవీ కాలంలో దిగజారిపోయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నియంత్రించింది. రాష్ట్ర ఉద్యోగులు వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ 62 రోజుల సమ్మె నిర్వహించారు. కృపలానీ తన నిర్ణయంలో దృఢంగా ఉండి, కార్మికులు రాజీకి సిద్ధంగా ఉన్నప్పుడు వారి అభ్యర్థనను అంగీకరించినట్లు భావిస్తున్నారు[2] . సుచేతా కృపలానీ రాజకీయ జీవితములో ఆమె అఖిల భారత మహిళా కాంగ్రెస్ ను స్థాపించారు. 1949లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి ప్రతినిధిగా ఉన్న ఆమె 1961లో అంతర్జాతీయ కార్మిక సంస్థకు భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. 1971లో సుచేతకృపలానీ రాజకీయాల నుంచి విరమించారు. ఆమె 1974లో మరణించింది. సుచేతకృపలానీ స్వతంత్ర గణతంత్రానికి అంకితమైన జీవితం.