భారతదేశ రూపురేఖలు
From Wikipedia, the free encyclopedia
భారతదేశపు రూపురేఖల గురించి తెలుసుకునేందుకు ఉపయోగపడే వివిధ అంశాలకు సంబంధించిన లింకులను కింద చూడవచ్చు:
భారతదేశం దక్షిణ ఆసియాలోని భారత ఉపఖండంలో ఉంది. విస్తీర్ణం ప్రకారం ఇది, ప్రపంచంలో ఏడవ అతిపెద్ద దేశం. భారతదేశం పురాతన సింధు లోయ నాగరికతకు నిలయం, హిందూయిజం, సిక్కుమతం, బౌద్ధమతం, జైనమతాలకు జన్మస్థలం. భారతదేశం వలస పాలనను భరించింది. 19వ శతాబ్దం మధ్యకాలం నుండి 20వ శతాబ్దం మధ్యకాలం వరకు యునైటెడ్ కింగ్డమ్ పాలనలో ఉంది. మహాత్మా గాంధీ వంటి ప్రభావవంతమైన వ్యక్తుల నేతృత్వంలో ప్రధానంగా అహింసాయుతమైన ప్రతిఘటన రూపంలో స్వాతంత్ర్యం కోసం పోరాటం తర్వాత 1947లో భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించింది. ఆ తరువాత హింసాత్మక విభజనకు గురైంది. భారతదేశం 140 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన ప్రజాస్వామ్యం కూడా.