బుద్ధ పూర్ణిమ
From Wikipedia, the free encyclopedia
బౌద్ధ పూర్ణిమ లేదా వైశాఖి లేదా విశాఖ అనేది వైశాఖ మాస (మే నెల) పౌర్ణమి రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులందరూ జరుపుకునే పండుగ. ఈ రోజున వివిధ మతపరమైన కార్యక్రమాలు బుద్ధుని జీవిత చరిత్ర బోధనలు చదవటం వంటివి చేస్తారు. ఈ సందర్భంగా మండపాలు, స్తంభాలు, దీపాలు ఏర్పాటు చేసి ఎక్కడ చూసినా ఉత్సవాలు నిర్వహిస్తారు.[1]