ప్రఫుల్ల చంద్ర రాయ్
From Wikipedia, the free encyclopedia
ఆచార్య ప్రఫుల్ల చంద్ర రాయ్ (బెంగాలీ: প্রফুল্ল চন্দ্র রায়) (1861 ఆగస్టు 2 - 1944 జూన్ 16) [2] బెంగాలీ విద్యావేత్త, ప్రసిద్ధ రసాయన శాస్త్రజ్ఞుడు, విద్యావేత్త, చరిత్రకారుడు, పారిశ్రామికవేత్త, పరోపకారి.[2] బెంగాలీ జాతీయవాదిగా అతను రసాయనశాస్త్రంలో మొట్టమొదటి భారతీయ పరిశోధనా పాఠశాలను స్థాపించాడు. భారతదేశంలో రసాయన శాస్త్ర పితామహుడిగా పరిగణించబడ్డాడు.[3] ఆయన జీవితం, పరిశోధనలను ఐరోపా ఖండం బయట జరిగిన మొట్టమొదటి రసాయనశాస్త్ర మైలురాయిగా రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ఫలకంతో సత్కరించింది. ఆయన భారతదేశపు మొట్టమొదటి ఔషధ సంస్థ బెంగాల్ కెమికల్స్ & ఫార్మాస్యూటికల్స్ ను స్థాపించాడు. అతను ఎ హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ ఫ్రమ్ ది ఎర్లీస్ట్ టైమ్స్ ఫ్రమ్ మిడిల్ ఆఫ్ సిక్స్టీంత్ సెంచరీ (1902) అనే గ్రంథాన్ని రచించాడు. భారతీయుల విజ్ఞానము గూర్చి ప్రపంచానికి తెలుపుతూ ఈయన ఎన్నో వ్యాసాలు వ్రాసాడు. అతను భారతదేశం ఆధ్యాత్మికత బోధించడంలోనే కాదు విజ్ఞాన పరంగా కూడా ఎంతో ముందున్నదని చెప్పేవాడు. ఆంగ్ల ఔషధాలకు దీటుగా దేశీయ ఔషధాలు తయారుచేసే ఒక సంస్థను స్థాపించాడు.
ప్రఫుల్ల చంద్ర రాయ్ | |
---|---|
జననం | ప్రఫుల్ల చంద్ర రాయ్ (1861-08-02)1861 ఆగస్టు 2 రారులీ-కటిపర , జెస్సోర్ జిల్లా, బెంగాల్ రాజ్యం, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం ఖుల్నా జిల్లా, కుల్నా డివిజన్, బంగ్లాదేశ్ ) |
మరణం | 1944 జూన్ 16(1944-06-16) (వయసు 82) కోల్కాతా, బెంగాల్ రాజ్యం, బ్రిటిష్ ఇండియా (now India) |
జాతీయత | భారతీయుడు |
రంగములు |
|
వృత్తిసంస్థలు |
|
చదువుకున్న సంస్థలు | కలకత్తా విశ్వవిద్యాలయం (బి.ఎ) ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం (బి.ఎస్.సి, డి.ఎస్.సి) |
పరిశోధనా సలహాదారుడు(లు) | అలగ్జాండర్ క్రం బ్రౌన్ |
ముఖ్యమైన విద్యార్థులు | సత్యేంద్రనాథ్ బోస్ మేఘనాధ్ సాహా జ్ఞానేంద్రనాథ్ ముఖర్జీ జ్ఞాన్ చంద్ర ఘోష్ |
ప్రసిద్ధి | భారతీయ రసాయనశాస్త్ర పరిశోధన వ్యవస్థాపకుడు; భారతీయ రసాయన పరిశ్రమ వ్యవస్థాపకుడు |
ముఖ్యమైన పురస్కారాలు | |
సంతకం |