పంజాబీ వస్త్రధారణ
From Wikipedia, the free encyclopedia
పురాతన పంజాబు ప్రాంతంలో ప్రజలు పత్తినూలుతో చేసిన వస్త్రాలను ధరించేవారు. స్త్రీపురుషులు ఇరువురు ధరించే పైదుస్తులు మోకాలును తాకుతూ ఉంటాయి. రెండుభుజాను కలుపుతూ స్త్రీలు దుపట్టా అనే వస్త్రాన్ని ధరిస్తుంటారు.స్త్రీపురుషులురువురు నడుంచుట్టూ ఒక వస్త్రాన్ని ధరిస్తుంటారు. తలకు మఫ్లర్ ధరిస్తారు. [1] ఆధునిక పంజాబీ దుస్తులు ఈ శైలిలో తయారు చేయబడుతున్నా. అయినప్పటికీ దీర్ఘకాల చరిత్రలో ఈ దుస్తులు అనేకరూపాంతరాలు చెందాయి.
19-20 శతాబ్ధాలలో పంజాబీ ప్రాంతం నూలు వస్త్రాల ఉత్పత్తి అభివృద్ధి చెందింది. లుంగి, ఖెస్, దతాహి, చద్దర్, కోస్టింగ్, షర్టులు (చొక్కాలు), తెరలు, సిసి, తెహ్మత్, దుర్రీలు, తువ్వాలు, డస్టర్లు, పత్కాలు తయారుచేయబడ్డాయి.ఇవి హోషిపూర్, గుర్దాస్పూర్, పెషావర్, లాహోర్, ముల్తాన్, [2]అమృతసర్, లూధియానా, ఝంగ్, షహ్పూర్ (పాకిస్థాన్), జలంధర్, ఢిల్లీ, గుర్గావ్ రోహ్తక్, కర్నల్, రెవారి, పానిపట్ నగరాలలో మొదలైనవి ఉత్పత్తి చేయబడుతున్నాయి[3] పంజాబీ దుస్తులకు నేతపరిశ్రమ సంపాన్నతను అధికం చేసింది. దుస్తులు పంజాబీ ప్రజల సంప్రదాయాన్ని సుసంపన్నం చేస్తున్నాయి.[4][5] వైవిధ్యమైన పంజాబీ పండుగలు, ప్రాంతీయ ఉత్సవాలు, వివాహాది సంప్రదాయ వేడుకలో విభిన్నమైన దుస్తులు ధరిస్తుంటారు. వీటితో విభిన్నమైన సంప్రదాయ దుస్తులు ఆభరణాలు సాధారణం.[6][7]