పంచ సంస్కారాలు
From Wikipedia, the free encyclopedia
వైష్ణవ మతంలోనికి ఇతరులను స్వీకరించేందుకు, వైష్ణవుల పిల్లలు ఉపనయనం జరిగాకా జరిగే సంస్కారాలను పంచ సంస్కారాలని వ్యవహరిస్తారు. హిందూమతంలోని భాగమైన వైష్ణవంలో విష్ణుమూర్తినే ప్రధానదైవంగా మిగతా దేవగణాల కన్నా అధికునిగా భావిస్తారు. 10వ శతాబ్ది నుంచీ తమిళనాట, తెలుగునాట ఆధ్యాత్మిక విప్లవంగా ప్రారంభమైన వైష్ణవం అన్ని కులాలకూ ముక్తిని పొందే హక్కు ఉందని పేర్కొంటూ, కులభేదాలు లేకుండా ముక్తికి యోగ్యులయ్యేందుకు సంస్కారాలను నిర్దేశించింది.[1]