నిధి చాల సుఖమా
From Wikipedia, the free encyclopedia
నిధి చాల సుఖమా అనేది ప్రాచుర్యం పొందిన కీర్తన[1]. దీనిని తంజావూరు రాజుగారు త్యాగరాజునకు ధన, కనక, వస్తు, వాహనాది సంపదలు పంపించి రాజసభలకు ఆహ్వానించినప్పుడు త్యాగరాజు గారు ఆలపించిన కీర్తన.
ఈ కీర్తన మేచకళ్యాణి జన్యమైన కళ్యాణి రాగం, త్రిపుట తాళం లో గానం చేస్తారు.[2][3] ఈ కీర్తనను 1981 లో విడుదలైన త్యాగయ్య సినిమాలో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గానం చేసాడు. 1946 లో విడుదలైన త్యాగయ్య లో చిత్తూరు నాగయ్య ఈ పాటను గానం చేసాడు.