నానా ఫడ్నవిస్
From Wikipedia, the free encyclopedia
నానా ఫడ్నవిస్ (ఫిబ్రవరి 12, 1742 – మార్చి 13, 1800) భారతదేశంలోని పూణేలో పీష్వా పరిపాలన సమయంలో జీవించిన మరాఠా సామ్రాజ్య యోధుడు. జేమ్స్ గ్రాంట్ డఫ్ యూరోపియన్లు అతనిని "మరాఠా మాకియవెల్లి" అని పిలిచేవారు. 1761లో మూడవ పానిపట్టు యుద్ధం తర్వాత నానా ఫడ్నవిస్ తన తెలివితేటలతో మరాఠా సామ్రాజ్యంలో ఏర్పడిన అస్థిరతను తొలగించి మళ్ళీ శక్తివంతంగా చేశాడు.[1] నానా ఫడ్నవిస్, తన తెలివితేటలు దౌత్యంతో బ్రిటిష్ వారిని రెండు సార్లు ఓడించిన మరాఠా చాణక్యుడు. 1800 వ సంవత్సరం లో నానా ఫడ్నవిస్ మరణించిన తర్వాత మరాఠా సామ్రాజ్యం కొద్ది కొద్దిగా క్షిణించి బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్ళింది.[2]
త్వరిత వాస్తవాలు నానా ఫడ్నవిస్, జననం ...
నానా ఫడ్నవిస్ | |
---|---|
జననం | బాలాజీ జనార్దన్ భాను 12 ఫిబ్రవరి 1742 సతారా, మరాఠా సామ్రాజ్యం మహారాష్ట్ర, భారతదేశం |
మరణం | 1800 మార్చి 13(1800-03-13) (వయసు 58) పూణే, మరాఠా సామ్రాజ్యం మహారాష్ట్ర, భారతదేశం |
మతం | హిందూధర్మం |
Occupation | పీష్వా పరిపాలనలో మరాఠా సామ్రాజ్యం ప్రముఖ మంత్రి, రాజనీతిజ్ఞుడు |
మూసివేయి