థామస్ పైన్
From Wikipedia, the free encyclopedia
థామస్ పైన్ అమెరికాకు చెందిన ప్రముఖ తత్వవేత్త, రాజకీయ ఉద్యమ కర్త, రాజనీతి సిద్ధాంతకర్త. అమెరికా దేశ వ్యవస్థాపక నాయకులలో ఒకరు. థామస్ పేన్ అమెరికా దేశ స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో రచించిన రెండు ప్రముఖ సంపుటాలు "కామన్ సెన్సు, ది ఏజ్ ఆఫ్ రీజన్" అతనికెంతో కీర్తిని తెచ్చినవి. అతని రచనలు అమెరికా దేశానికి బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందేటందుకు పోరాడిన విప్లకారులకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. చివరికి 1776 లో ఆ స్పూర్తే అమెరికా దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధింపజేసింది.[1] థామస్ పేన్ యొక్క ఆలోచనలు సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని ప్రతిబింబింపజేసేవిగా వుండేవి. .[2] థామస్ పేన్ ను ప్రవృత్తి రీత్యా వైద్యునిగాను, వృత్తి రీత్యా పాత్రికేయునిగాను, సమాజంలో ఏర్పడే మార్పుల ద్వారా విప్లవ ప్రచార కర్తగానూ పలురకాల పాత్రలను పోషించాడని మేధావుల అభిప్రాయం.[3]