తుంగభద్ర ఆనకట్ట
From Wikipedia, the free encyclopedia
తుంగభద్ర ఆనకట్టను కృష్ణా నదికి ఉపనదియైన తుంగభద్ర నదిపై నిర్మించారు.[1][2] ఈ ఆనకట్ట కర్నాటకలోని హోస్పేట్ పట్టణానికి సమీపంలో ఉంది. ఇది ఒక బహుళార్ధసాధక ఆనకట్ట, ఇది నీటిపారుదలకు, విద్యుత్ ఉత్పత్తికి, వరదలను నియంత్రించేందుకు ఇంకా తదితర సేవలకు ఉపయోగపడుతుంది. దీని నిర్మాణం 1943లో ప్రారంభమైనప్పుడు అప్పటి హైదరాబాద్ రాష్ట్రం, అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీల యొక్క ఒక ఉమ్మడి ప్రాజెక్టు. తరువాత 1953లో దీని నిర్మాణం పూర్తయిన తరువాత ఇది కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల యొక్క ఉమ్మడి ప్రాజెక్టుగా మారింది. ఈ ఆనకట్ట యొక్క ప్రధాన ఆర్కిటెక్ట్ డాక్టర్ తిరుమలై అయ్యంగార్, ఇతను మద్రాస్ కు చెందిన ఒక ఇంజనీరు.
కర్నాటకలోని బళ్లారి, రాయచూరు, ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు, అనంతపూర్ జిల్లాలకు నీటిని అందించేందుకు వీలుగా ఈ డ్యాం నుంచి లోలెవల్, హైలెవల్, లెఫ్ట్ బాంక్ కెనాల్స్ నిర్మించారు. ముఖ్యంగా లోలెవల్స్ అంటే ఎల్ ఎల్ సి కెనాల్ ను కర్నూలు జిల్లాకు తాగునీరు అందించేందుకు నిర్మించారు. ఖరీఫ్, రబీ సీజన్ లో ఎల్ఎల్సి కాలువ కింద సుమారు లక్షా 52 వేల ఎకరాల ఆయకట్టు ఉంది, 200 గ్రామాలకు తాగునీరు కూడా అందుతుంది.