తమిళనాడులో 2004 భారత సార్వత్రిక ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
తమిళనాడులో 2004 భారత సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రంలోని 39 స్థానాలకు జరిగాయి. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యుపిఎ), దాని మిత్రపక్షాలైన లెఫ్ట్ ఫ్రంట్తో కూడిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (డిపిఎ) రాష్ట్రంలోని మొత్తం 39 స్థానాలను గెలుచుకున్నాయి. డిఎమ్కె దాని మిత్రపక్షాలు పాండిచ్చేరిలోని ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. దీంతో యుపిఎ, తమిళనాడు, పాండిచ్చేరిల లోని మొత్తం 40 సీట్లనూ గెలుచుకున్నట్లైంది. కూటమిలో 2 పెద్ద భాగస్వాములైన ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎమ్కె) (16) ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (కాంగ్రెస్) (10) మెజారిటీ సీట్లను గెలుచుకున్నాయి. జూనియర్ భాగస్వాములైన పట్టాలి మక్కల్ కట్చి (పిఎమ్కె) (5), మారుమరలర్చి ద్రవిడ మున్నేట్ర కజగం (ఎమ్డిఎమ్కె) (4), లెఫ్ట్ ఫ్రంట్ పార్టీలు (4) మిగిలిన వాటిని గెలుచుకున్నాయి. కేంద్రంలో ప్రభుత్వానికి లెఫ్ట్ ఫ్రంట్ మద్దతు కారణంగా, తమిళనాడులోని మొత్తం 39 స్థానాలు యుపిఎ నేతృత్వంలోని ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చాయి.
| |||||||||||||||||||||||||||||||
39 స్థానాలు | |||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||||||||||||||||||||||||
2004 సార్వత్రిక ఎన్నికల మ్యాపు ఆకుపచ్చ = యుపిఎ (అన్నిటినీ గెలుచుకుంది) |
అయోధ్య సమస్య కారణంగా డిఎమ్కె, పిఎమ్కె, ఎమ్డిఎమ్కె లు ఎన్డిఎని విడిచిపెట్టి, యుపిఎకి మద్దతు ఇచ్చే డిపిఎ కూటమిని ఏర్పరచాయి. ఈ రాష్ట్రంలో తమ బిజెపి-ఎఐఎడిఎంకె కూటమి ఒక్క సీటు కూడా గెలవలేదు.[1]