తమిళనాడులో 1998 భారత సార్వత్రిక ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
తమిళనాడులో 1998 భారత సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రంలోని 39 స్థానాలకు జరిగాయి. రాజీవ్ గాంధీ హత్యకు కారకులైన శ్రీలంక వేర్పాటువాదులతో ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎమ్కె) కు సంబంధాలున్నాయని దర్యాప్తు ప్యానెల్ చెప్పిన తరువాత IK గుజ్రాల్ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఆ పార్టీని ప్రభుత్వం నుండి తొలగించడానికి నిరాకరించడంతో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యునైటెడ్ ఫ్రంట్ నుంది వైదొలగడంతో ఈ ఎన్నికలు జరిగాయి.[1] ఎన్నికల్లో నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్ (ఎన్డిఎ) 30 సీట్లు గెలుచుకుని ఘన విజయం సాధించింది. భారతదేశ 16వ ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి పదవీ స్వీకారం చేయడంలో ఇది దోహదపడింది. జె. జయలలిత నేతృత్వం లోని ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం, భారత జాతీయ కాంగ్రెస్తో ఉన్న సుదీర్ఘ కాలపు పొత్తును విడిచిపెట్టి, జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో చేరింది. అన్నాడీఎంకే యొక్క 18 సీట్లు ప్రధానమంత్రిని నిర్ణయించడంలో చాలా కీలకమైన పాత్ర పోషించాయి. అయితే ఏఐఏడీఎంకే ఈ కూటమి నుంచి ఏడాది లోపే వైదొలిగింది. దాంతో భాజపా విశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో మళ్ళీ ఏడాది లోనే ఎన్నికలు వచ్చాయి.
| |||||||||||||||||||||||||||||||
39 స్థానాలు | |||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నమోదైన వోటర్లు | 4,55,77,788 | ||||||||||||||||||||||||||||||
వోటింగు | 2,64,10,702 (57.95%) 8.98% | ||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||
1998 ఎన్నికల ఫలితాలు కాషాయం= NDA, ఎరుపు= UF |