తమిళనాడులో 1971 భారత సార్వత్రిక ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
తమిళనాడులో 1971 భారత సాధారణ ఎన్నికల ఎన్నికలు రాష్ట్రంలోని 39 స్థానాలకు జరిగాయి. 1967 ఎన్నికల్లో గెలిచిన తర్వాత డిఎంకె, ఇందిరా గాంధీ ఆధ్వర్యం లోని కాంగ్రెస్ (ఇందిర) పార్టీకి మద్దతు ఇచ్చింది. 1969 నుండి 1971 వరకు మైనారిటీ ప్రభుత్వంగా అధికారంలో ఉండేలా 25 డిఎంకె ఎంపిలు ఆమెకు మద్దతిచ్చారు.[1] ఇందిరాగాంధీ అధికారంలో కొనసాగాలంటే ఈ ఎన్నికల్లో ఈ రాష్ట్రం చాలా కీలకమైనది.
త్వరిత వాస్తవాలు 39 స్థానాలు, నమోదైన వోటర్లు ...
| ||||||||||||||||||||||||||||||||||
39 స్థానాలు | ||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నమోదైన వోటర్లు | 2,30,64,983 | |||||||||||||||||||||||||||||||||
వోటింగు | 1,65.65,949 (71.82%) 4.74% | |||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||
ఎన్నికల ఫలితాలు |
మూసివేయి
ఎన్నికల ఫలితాల్లో భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర), దాని మిత్రపక్షం ద్రవిడ మున్నేట్ర కజగం లు 38 స్థానాల్లో విజయం సాధించగా, ప్రతిపక్ష కాంగ్రెస్, స్వతంత్ర పార్టీలు 1 సీటు మాత్రమే గెలుచుకోగలిగాయి. నాగర్కోయిల్లో కె. కామరాజ్ పోటీ చేసిన సీటు మినహా డీఎంకే తాను పోటీ చేసిన ప్రతి సీటునూ గెలుచుకుంది.