డూప్లే
From Wikipedia, the free encyclopedia
వ్యాపారంకోసం 17 వ శతాబ్దములో వచ్చిన ఫ్రెంచి వ్యాపార సంస్ధ కూడా అంతకు ముందుగానే వచ్చిన ఆంగ్లేయ, డచ్చి ఈస్టిండియా కంపెనీ లలాగనే ఫ్రెంచి ఈస్ట్ ఇండియా కంపెనీగా సా.శ. 1668 లో స్థాపింపబడింది. 18వ శతాబ్దమునాటి దేశ పరిస్థితులలో మొగల్ చక్రవర్తి సామ్రాజ్య పరిపాలన పట్టుసడలుతుండగా, వివిధ రాజ్యములలో అంతఃకలహములు, చక్రవర్తికి సుబేదారులైన నవాబులే కాక, అనేక ప్రాంతీయ సామంతరాజులక్రిందనున్న చిన్న చిన్న రాజులుకూడా స్వతంత్రులగుటకు ప్రయత్నించుట, వైషమ్యాలతో ఒకరిపైనొకరు యుధ్ధములకు దిగటం మొదలగు విఛ్ఛిన పరిస్థితులలో వ్యాపారంకన్నా ప్రాముఖ్యమైనది రాజ్య ఆక్రమణ, వలసరాజ్యస్థాపనే అని తలచి బ్రిటిష్ వారికన్నా ముందే ప్రయత్నించినది ఫ్రెంచి కంపెని అధిపతి, డూప్లే దొర ( పూర్తిపేరు జోసెఫ్ ఫాంకోయిస్ డూప్లే : Joseph Francois Dupleix). ఆ మార్గమునే అవలంబించిన బ్రిటిష్ వారు ప్రతిపక్షము వహించటంవల్ల వీరికీ ఫ్రెంచివారికీ వారి వారి పక్షముల తరఫుననే కాక ఆధిపత్యకాంక్షతో సరాసరి యుద్ధములు కూడా జరిగినవి. అయితే డూప్లే తలపెట్టిన రాజ్యాక్రమణ, వలసరాజ్యస్థాపన సైనికి బలపరాక్రమముల ప్రయేగముతోనూ అధిక ధనవ్యయముతో కూడి తత్కాలఫలితమిచ్చెదై యుండగా అదే లక్ష్యములు తలపోసిన బ్రిటిష్ వారి రాజతంత్రముల ప్రయోగం క్రమేణ ఫలితమిచ్చెడిదైనది. చివరకు పైచేయి బ్రిటిష్ వారిదైనది. సా.శ. 1754 లో డూప్లే దొర ఇండియాను వదలిపెట్టి వెళ్ళడంతో ఫ్రెంచి ఇండియా క్రమేణా క్షీణించి బ్రిటిష్ ఇండియా బలపడి 1948 దాకా జరిగినదే బ్రిటిష్ ఇండియా చరిత్ర.[1].
జోసెఫ్ ఫాంకోయిస్ డూప్లే Joseph François Dupleix | |
---|---|
Governor-General of French India | |
In office 14 జనవరి 1742 – 15 అక్టోబరు 1754 | |
చక్రవర్తి | లూయీ XV |
అంతకు ముందు వారు | Pierre Benoît Dumas |
తరువాత వారు | Charles Godeheu As Acting Governor-General |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1 జనవరి 1697 Landrecies, ఫ్రాన్స్ |
మరణం | 10 నవంబర్ 1763 (aged 66) పారిస్, ఫ్రాన్స్ |