డార్జిలింగ్
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న పట్టణం / From Wikipedia, the free encyclopedia
డార్జిలింగ్, అనేది భారతదేశం, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఉత్తర ప్రాంతంలో ఉన్న ఒక పట్టణం. ఇధి పురపాలక సంఘం. ఇది సముద్రమట్టానికి 2,045 metres (6,709 ft) సగటు ఎత్తులో తూర్పు హిమాలయాలలో ఉంది.[9] డార్జిలింగ్కు పశ్చిమాన నేపాల్ తూర్పున ఉన్న ప్రావిన్స్, తూర్పున భూటాన్ రాజ్యం, ఉత్తరాన భారతదేశం లోని సిక్కిం రాష్ట్రం, ఉత్తరాన చైనాలోని టిబెట్ స్వాధికార ప్రాంతం ఉన్నాయి. దక్షిణ, ఆగ్నేయంలో బంగ్లాదేశ్ ఉంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోని చాలా భాగం దక్షిణ నైరుతి దిశలో ఉంది. డార్జిలింగ్ ప్రాంతానికి ఇరుకైన మార్గం ద్వారా అనుసంధానించబడిxది. కాంచన్ జంగా, ప్రపంచం లోని మూడవ ఎత్తైన పర్వతం, ఉత్తరాన ఉంది.స్పష్టమైన రోజులలో ఇది ప్రముఖంగా కనిపిస్తుంది.[lower-alpha 6] [14]
Darjeeling | |
---|---|
Town | |
Coordinates: 27°02′15″N 88°15′47″E | |
Country | India |
State | West Bengal |
District | Darjeeling |
Settled | Leased in 1835 from Tsugphud Namgyal, the Chogyal of the Kingdom of Sikkim, and annexed in 1849.[1][2][3] Municipality, 1 July 1850.[4][5] |
Founded by | British East India Company, during Company rule in India[6][7] |
Government | |
• Body | Darjeeling Municipality |
• Chairman | Amar Singh Rai |
Area | |
• Total | 7.43 km2 (2.87 sq mi) |
Elevation | 2,045 మీ (6,709 అ.) |
Population | |
• Total | 1,18,805 |
• Density | 15,990/km2 (41,400/sq mi) |
Languages | |
• Official | Bengali and Nepali[12] |
Time zone | UTC+5:30 (భా.ప్రా.కా) |
19వ శతాబ్దం ప్రారంభంలో, భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో, డార్జిలింగ్ బ్రిటీష్ అధికారుల, సైనికుల కుటుంబాలకు వేసవి విడిదికి అనువైన ప్రదేశంగా గుర్తించారు. సిక్కిం రాజ్యం నుండి ఇరుకైన పర్వత శిఖరం లీజుకు తీసుకోబడింది. చివరికి అది బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయబడింది. డార్జిలింగ్ దిగువన ఉన్న పర్వత వాలులలో తేయాకు తోటలు పెంచే ప్రయోగం చాలా విజయవంతమైంది. అడవులను నిర్మూలించటానికి, యూరోపియన్ తరహాలో విహారయాత్రికుల కుటీరాలు నిర్మించడానికి, తేయాకు తోటలలో పని చేయడానికి వేలాదిమంది కార్మికులను ప్రధానంగా నేపాల్ నుండి నియమించారు. విస్తృతమైన అటవీ నిర్మూలన స్థానిక ప్రజలను స్థానభ్రంశం చేసింది. భారతదేశంలో నివసించే బ్రిటిష్ వారి పిల్లల విద్య కోసం డార్జిలింగ్, చుట్టుపక్కల రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పడ్డాయి. 19వ శతాబ్దపు చివరినాటికి, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే అనే నోవల నారో-గేజ్ పర్వత రైల్వేద్వారా, వేసవి నివాసితులను పట్టణంలోకి తీసుకువచ్చింది. ప్రపంచానికి ఎగుమతి చేయడానికి తేయాకు సరుకును తీసుకువెళ్లింది.1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, బ్రిటీష్ వారు డార్జిలింగ్ను విడిచిపెట్టినప్పుడు, దాని తేయాకు తోటల మైదాన ప్రాంతాలనుండి కాటేజీలను సంపన్న భారతీయులు, పట్టణం వెలుపల ఉన్నభారతీయ వ్యాపార యజమానుల సమూహాలు కొనుగోలు చేశారు.
పట్టణ అసలైన అభివృద్ధిలో పనిచేసిన స్వదేశీ వలస కార్మికుల వారసుల నుండి ఎక్కువగా ఈ రోజు డార్జిలింగ్ జనాభా ఏర్పడింది. వారి సాధారణ భాష నేపాలీ భాషకు, భారతదేశ రాష్ట్రసమాఖ్య స్థాయిలలోఅధికారిక గుర్తింపు లభించినప్పటికీ, ఆ గుర్తింపు ఆ భాష మాట్లాడేవారికి అర్ధవంతమైన ఉపాధిని సృష్టించలేదు, లేదా వారిరాజకీయ వ్యవహారాలలో చెప్పుకోదగినంత గొప్పగా మాట్లాడే సామర్థ్యాన్ని పెంచలేదు. తేయాకు పరిశ్రమ, పర్యాటకం పట్టణ ఆర్థిక వ్యవస్థకు ప్రధానమైన వనరులు.భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో అటవీనిర్మూలన పర్యావరణానికి నష్టాన్ని కలిగించింది. పట్టణానికి నీటిని సరఫరా చేసే శాశ్వత నీటి బుగ్గలను ప్రభావితం చేసింది. ఆ సమయంలో సంవత్సరాలుగా డార్జిలింగ్ జనాభా విస్తృతంగా అభివృద్ధి చెందింది. క్రమబద్ధీకరించని నిర్మాణాలు, ట్రాఫిక్ రద్దీ, నీటి కొరత సర్వసాధారణమయ్యాయి. చాలామంది స్థానిక యువకులు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నారు. వారి నైపుణ్యాలకు సరిపోయే ఉద్యోగాలు లేకపోవడంతో వారు వలస వెళ్ళవలసి వచ్చింది. ఈశాన్య భారతదేశం ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చిన వారిలాగే, వారు కొన్ని భారతీయ నగరాల్లో వివక్ష, జాత్యహంకారానికి గురయ్యారు.
డార్జిలింగ్ సంస్కృతి అత్యంత విశ్వజనీనమైంది. విభిన్న జాతులు తమ చారిత్రక మూలాల నుండి దూరంగా కలిసిపోయి అభివృద్ధి చెందాయి.ఆ ప్రాంత దేశీయవంటకాలలో పులియబెట్టిన ఆహారాలు, పానీయాలు పుష్కలంగా ఉన్నాయి. 19వ శతాబ్దం మధ్యకాలం నుంచి డార్జిలింగ్కు పర్యాటకులు తరలి వచ్చారు.1999లో దాని మద్దతు కోసం అంతర్జాతీయ ప్రచారం తర్వాత, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. 2005లో డార్జిలింగ్ తేనీరుకు బ్రాండ్ రక్షణ కోసం, దానిని ఉత్పత్తి చేసే ప్రాంత అభివృద్ధి కోసం ప్రపంచ వాణిజ్య సంస్థ భౌగోళిక సూచనను అందించింది.