డబ్ల్యు.సి.బెనర్జీ
ఇండియన్ బారిస్టర్, భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు / From Wikipedia, the free encyclopedia
వోమేష్ చుందర్ బొన్నర్జీ (లేదా ఉమేష్ చంద్ర బెనర్జీ) (1844 డిసెంబరు 29 -190621 జూలై 21) ఒక భారతీయ న్యాయవాది. అతను భారత జాతీయ కాంగ్రెస్ సహవ్యవస్థాపకుడు, [1] మొదటి అధ్యక్షుడు. 1844లో కలకత్తాలో జన్మించాడు. అతని విద్యాభ్యాసం ఓరియంటల్ సెమినరీ, హిందూ పాఠశాలలో జరిగింది.1862లో కలకత్తా సుప్రీంకోర్టు న్యాయవాదులు డబ్ల్యు.పి. గిల్లెండర్ సంస్థలో గుమస్తాగా చేరినప్పుడు అతని జీవితగమనం ప్రారంభమైంది.1864లో అతను ఇంగ్లాండ్ వెళ్లాడు. లండన్లోని ఇన్స్ ఆఫ్ కోర్టు ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్డమ్లో భాగమైన వేల్స్ దేశం లోని న్యాయవాదుల వృత్తిపరమైన సంఘాలుకు కోర్టులోఉన్న నాలుగు వసతిగృహాలలోని మిడిల్ టెంపుల్ లో న్యాయవాదవృత్తిలో తగిన విద్యను అభ్యసించడానికి చేరాడు.1867 జూన్ లో అతను న్యాయవాదిగా న్యాయవాదుల సంఘంలో చేరాడు. అతను1868లో కలకత్తాకు తిరిగి వచ్చాడు. కొద్దికాలంలోనే అతను ఉన్నత న్యాయస్థానం గుర్తించిన అత్యంత న్యాయవాది అయ్యాడు. అతను స్టాండింగ్ కౌన్సిల్గా వ్యవహరించిన మొదటి భారతీయుడు. దీనిలో1882,1884,1886, 1887లలో అతను నాలుగుసార్లు బాధ్యతలు నిర్వర్తించాడు.1883 లో సురేంద్రనాథ్ బెనర్జీపై మోపిన కోర్టు ధిక్కరణ కేసునందు కలకత్తా హైకోర్టులో ఉమేష్ చంద్ర బెనర్జీ అతని తరుపున వాదించాడు. అతను కలకత్తా విశ్వవిద్యాలయంలో ఫెలో దాని న్యాయ అధ్యాపకులకు అధ్యక్షుడిగా ఉన్నాడు. 1901లో కలకత్తా బార్ నుండి పదవీవిరమణ అయ్యాడు.
వోమేష్ చందర్ బెనర్జీ | |||
చిత్రపటం | |||
భారత జాతీయ కాంగ్రెస్ మొదటి, ఎనిమిదవ అధ్యక్షుడు | |||
వ్యక్తిగత వివరాలు |
|||
---|---|---|---|
జాతీయత | బ్రిటిష్ ఇండియన్ | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | హేమాంగిని మోతీలాల్ (m. 1859) | ||
పూర్వ విద్యార్థి | మిడిల్ టెంపుల్ | ||
వృత్తి | న్యాయవాది |
1885లో బొంబాయిలో డిసెంబరు 28 నుండి 31 వరకు జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సభకు అతను అధ్యక్షత వహించాడు. కలకత్తాలో జరిగిన 1886 సభలలో అతను తన పనిని చక్కగా సమన్వయం చేసుకోవడానికి ప్రతి కార్యాచరణ పరిధిలో కాంగ్రెస్ స్థాయీ సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాడు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తన కార్యకలాపాలను రాజకీయ విషయాలకే పరిమితం చేయాలని అతను సూచనలు చేసాడు. అతను అలహాబాద్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ 1892 సభలకు మళ్లీ అధ్యక్షుడయ్యాడు. ఆ సభలలో రాజకీయ స్వేచ్ఛ కోసం భారతదేశం నిరూపించుకోవలసిన స్థానాన్ని అతను ఖండించాడు.
అతను బ్రిటన్ వెళ్లి ప్రివీ కౌన్సిల్ ముందు న్యాయవాది వృత్తి చేసాడు. అతను లండన్ బ్రిటిష్ కమిటీ ఆఫ్ కాంగ్రెస్, దాని పత్రికలకు ఆర్థిక సహాయం చేసాడు. 1865లో దాదాభాయ్ నౌరోజీ లండన్ ఇండియన్ సొసైటీని స్థాపించాడు. బొన్నర్జీని దాని ప్రధాన కార్యదర్శిగా నియమించాడు. బొన్నర్జీ అతనితో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు నౌరోజీ అయినప్పుడు, ఎర్డ్లీ నార్టన్ విలియం డిగ్బీ లండన్లో కాంగ్రెస్ శాఖకు చెందిన కాంగ్రెస్ పొలిటికల్ ఏజెన్సీని ప్రారంభించారు. అతను 1892 యునైటెడ్ కింగ్డమ్ సార్వత్రిక ఎన్నికల్లో బారో ఫర్నేస్ సీటుకోసం లిబరల్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడంలో విఫలమయ్యాడు1893లో, నౌరోజీ, బెనర్జీ , బద్రుద్దీన్ త్యాబ్జీ ఇంగ్లాండ్లో భారతీయ పార్లమెంటరీ కమిటీని స్థాపించారు.