జింబాబ్వే
From Wikipedia, the free encyclopedia
జింబాబ్వే (ఆంగ్లం : Zimbabwe), అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ జింబాబ్వే. [2] ఇది దక్షిణాఫ్రికాలో ఉన్న ఒక భూబంధిత దేశం. దీని పాత పేర్లు రొడీషియా, రొడీషియా రిపబ్లిక్, దక్షిణ రొడీషియా. దీని దక్షిణసరిహద్దులో దక్షిణాఫ్రికా, నైఋతి సరిహద్దులో బోత్సవానా, వాయువ్యసరిహద్దులో జాంబియా, తూర్పు సరిహద్దులో మొజాంబిక్ దేశాలు ఉన్నాయి. ఇది జామ్బెజీ, లింపోపో నదుల మద్య ఉంది. రాజధాని, దేశంలో కెల్లా అతిపెద్ద నగరమూ హరారే. సుమారు 16 మిలియన్ల [3] జనాభా ఉంది. జింబాబ్వేలో 16 అధికారిక భాషలు ఉన్నాయి.[4] ఇంగ్లీషు, షోనా, నెదెబెలె అధికంగా వాడుకలో ఉన్నాయి.
రిపబ్లిక్ ఆఫ్ జింబాబ్వే Republika seZimbabwe Republiki ya Zimbabwe |
||||||
---|---|---|---|---|---|---|
నినాదం "Unity, Freedom, Work" |
||||||
రాజధాని అతి పెద్ద నగరం | హరారే 17°50′S 31°3′E | |||||
అధికార భాషలు | English | |||||
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు | Shona, isiNdebele | |||||
ప్రజానామము | Zimbabwean | |||||
ప్రభుత్వం | Semi presidential, parliamentary, consociationalist republic | |||||
- | President | Emmerson Mnangagwa (2017-) | ||||
- | Prime Minister | Vacant | ||||
- | Vice President | Joseph Msika Joice Mujuru |
||||
- | Deputy Prime Minister | Thokozani Khuphe Arthur Mutambara |
||||
Independence | from the యునైటెడ్ కింగ్ డం | |||||
- | రొడీషియా | నవంబరు 11, 1965 | ||||
- | జింబాబ్వే | ఏప్రిల్ 18, 1980 | ||||
- | జలాలు (%) | 1 | ||||
జనాభా | ||||||
- | జనవరి 2008 అంచనా | 13,349,0001 (68వది) | ||||
జీడీపీ (PPP) | 2008 అంచనా | |||||
- | మొత్తం | $2.210 billion[1] | ||||
- | తలసరి | $188[1] | ||||
జీడీపీ (nominal) | 2008 అంచనా | |||||
- | మొత్తం | $4.548 బిలియన్లు[1] | ||||
- | తలసరి | $200[1] | ||||
జినీ? (2003) | 56.8 (high) | |||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) | 0.513 (medium) (151వది) | |||||
కరెన్సీ | Zimbabwean dollar 2 (ZWD ) |
|||||
కాలాంశం | Central Africa Time | |||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .zw | |||||
కాలింగ్ కోడ్ | +263 | |||||
1 Estimates explicitly take into account the effects of excess mortality due to AIDS. 2 Although it is still the official currency, the en:United States dollar, en:South African rand, Botswanan pula, en:Pound sterling and Euro are mostly used instead as the local currency is practically worthless. The US Dollar has been adopted as the official currency for all government transactions with the new power-sharing regime. |
11 వ శతాబ్దం నుండి ప్రస్తుతం జింబాబ్వే భూభాగాన్ని అనేక వ్యవస్థీకృత రాజ్యాలు పాలించాయి. వలస, వాణిజ్యం కొరకు ఇది ప్రధాన మార్గంగా ఉంది. సెసిల్ రోడ్స్ కు చెందిన బ్రిటిష్ సౌత్ ఆఫ్రికా కంపెనీ 1890 లలో ప్రస్తుత భూభాగాన్ని మొదట గుర్తించింది. ఇది 1923 లో దక్షిణ రోడేషియా స్వయంపాలిత బ్రిటిషు కాలనీగా మారింది. 1965 లో సాంప్రదాయిక శ్వేతజాతి అల్పసంఖ్యాక ప్రభుత్వం ఏకపక్షంగా రోడేషియా పేరుతో స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. ఆ తరువాత అంతర్జాతీయంగా ఒంటరితనం అనుభవిస్తూ, నల్లజాతివారి జాతీయవాద శక్తులతో 15 సంవత్సరాల గెరిల్లా యుద్ధాన్ని ఎదుర్కొన్నది. 1980 ఏప్రిల్లో జరిగిన శాంతి ఒప్పందంతో సార్వత్రిక వోటు హక్కుతో, జింబాబ్వే అనే సార్వభౌమ దేశంగా అవతరించింది. జింబాబ్వే అప్పుడు కామన్వెల్తు ఆఫ్ నేషన్సులో చేరింది. 2002 లో అప్పటి ప్రభుత్వం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినందుకు గాను, దానినుండి సస్పెన్షనుకు గురైంది. 2003 డిసెంబరులో దేశం ఆ కామంవెల్తు సభ్యత్వం నుండి తప్పుకుంది. ఐక్యరాజ్యసమితి, దక్షిణాఫ్రికా డెవలప్మెంట్ కమ్యూనిటీ (ఎస్.ఎ.డి.సి), ఆఫ్రికా సమాఖ్య (ఎ.యు), కామన్ మార్కెటు ఫర్ ఈస్ట్ అండ్ సౌత్ సంస్థలలో సభ్యదేశంగా ఉంది. దేశం లోని సంపదకు గుర్తింపుగా ఈ దేశాన్ని ఒకప్పుడు "జ్యువెల్ ఆఫ్ ఆఫ్రికా" గా పిలిచేవారు.[5][6][7]
1980 లో రాబర్టు ముగాబే జింబాబ్వే ప్రధాన మంత్రి అయ్యాడు. తన జను-పి.ఎఫ్. పార్టీ అల్పసంఖ్యాక శ్వేతజాతీయుల పాలన ముగిసిన తరువాత ఎన్నికలలో గెలిచింది. 1987 నుండి ఆయన జింబాబ్వే అధ్యక్షుడుగా (2017 లో ఆయన రాజీనామా వరకు) ఉన్నాడు. ముగాబే అధికార పాలనలో రాష్ట్ర భద్రతా దళం దేశంలో ఆధిపత్యం చెలాయిస్తుంది. విస్తారమైన మానవ హక్కుల ఉల్లంఘనకు బాధ్యత వహిస్తుంది. [8] ముగాబే శీతల యుద్ధం విప్లవవాద సామ్యవాద వాక్చాతుర్యంతో పాలన కొనసాగించాడు. పాశ్చాత్య పెట్టుబడిదారీ దేశాల కుట్రలో జింబాబ్వే ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుందని నిందించాడు.[9] సమకాలీన ఆఫ్రికా రాజకీయ నాయకులు ముగాబేను విమర్శించారు. ఆయన తన సామ్రాజ్యవాద వ్యతిరేక వాదనలను అణిచివేశాడు. అయినప్పటికీ ఆర్చి బిషపు డెస్మండు టుటు అతన్ని "ఒక ఆర్కిటిపల్ ఆఫ్రికన్ నియంత కార్టూను వ్యక్తి" అని పిలిచాడు.[10] 1990 ల నుంచి దేశంలో ఆర్ధిక క్షీణదశలో ఉంది. అనేక సంక్షోభాలు, అధిక ద్రవ్యోల్బణం ఎదుర్కొంటుంది.[11]
2017 నవంబరు 15 న తన ప్రభుత్వం, జింబాబ్వే వేగంగా క్షీణించే ఆర్థికవ్యవస్థకు వ్యతిరేకంగా నిరసనలు జరిగిన నేపథ్యంలో ముగాబేను దేశవాళీ జాతీయ సైన్యం గృహ నిర్బంధంలో ఉంచారు.[12][13] 2017 నవంబరు 19 న జను- పి.ఎఫ్. పార్టీ నాయకుడిగా రాబర్టు ముగాబేను తొలగించి ఆయన స్థానంలో ఉపాధ్యక్షుడు ఎమ్మెర్సను మన్నాగగ్వాను నియమించింది.[14] 2017 నవంబరు 21 న ముంగాంబే తనను పదవీచ్యుతుని చేయడానికి ముందుగా స్వయంగా రాజీనామా చేసాడు.[15] 2018 జూలై 30 న జింబాబ్వే జనరలు ఎన్నికలు నిర్వహించింది.[16] ఎన్నికలలో ఎమ్మెర్సను మన్గాగ్వా నేతృత్వంలోని జను-పి.ఎఫ్. పార్టీ గెలిచింది.[17] ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎం.డి.సి. అలయంసుకు నాయకత్వం వహించిన నెల్సను చమిసా ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ జింబాబ్వే రాజ్యాంగ న్యాయస్థానంకు ఒక పిటిషన్ను దాఖలు చేశారు.[18] మనగగ్వా విజయం తర్వాత న్యాయస్థానం ముగాబే తర్వాత ఆయనను అధ్యక్షుడిని చేసింది.[19][20]